త్రిస్సూర్ (Thrissur) లోని ఓ ఆలయ వేడుకల్లో (Tharakkal temple festival) రెండు ఏనుగులు (Elephants) బీబత్సం సృష్టించాయి. త్రిస్సూర్ జిల్లా అరట్టుపుజ గ్రామంలోని థారక్కల్ ఆలయంలో శుక్రవారం రాత్రి ఉత్సవ విగ్రహాల ఊరేగింపు కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంకేలో భక్తులు వచ్చారు. ఉత్సవ విగ్రహాలను ఊరేగించేందుకు రెండు ఏనుగులను తీసుకురాగా.. అందులో ఓ ఏనుగు అకస్మాత్తుగామా వటిని కింద పడేసి, మరో ఏనుగుపై దాడికి ప్రయత్నించింది. దీంతో ఆ ఏనుగు పరుగందుకుంది. దాదాపు కిలోమీటర్ దూరం పరిగెత్తింది.
We’re now on WhatsApp. Click to Join.
నియంత్రించేందుకు ప్రయత్నించిన మావటి శ్రీకుమార్ పైనా దాడి చేసింది. పైనుంచి కిందపడేయడంతో గాయపడ్డ శ్రీకుమార్ ను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో భక్తులు భయంతో పరుగులు పెట్టారు. ఈ క్రమంలో చాలామంది కిందపడి గాయాలపాలయ్యారు. విషయం తెలిసి అక్కడికి చేరుకున్న ఎలిఫెంట్ స్క్వాడ్ అతికష్టమ్మీద రెండు ఏనుగులను కంట్రోల్ చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
A captive #elephant runs amok during the Arattupuzha pooram in #Kerala's Thrissur. The elephant attacked an elephant and also injured several humans.
It is peak summer and also peak of temple festivals in Kerala. pic.twitter.com/QHvDLTPgOP— Bobins Abraham Vayalil (@BobinsAbraham) March 23, 2024
Read Also : Digvijaya Singh: 33 ఏళ్ల తర్వాత లోక్సభ ఎన్నికల బరిలో మాజీ సీఎం