Elephant Turns Violent : ఆలయ వేడుకల్లో బీబత్సం సృష్టించిన ఏనుగులు..

ఓ ఏనుగు అకస్మాత్తుగామా వటిని కింద పడేసి, మరో ఏనుగుపై దాడికి ప్రయత్నించింది. దీంతో ఆ ఏనుగు పరుగందుకుంది

  • Written By:
  • Publish Date - March 23, 2024 / 12:02 PM IST

త్రిస్సూర్ (Thrissur) లోని ఓ ఆలయ వేడుకల్లో (Tharakkal temple festival) రెండు ఏనుగులు (Elephants) బీబత్సం సృష్టించాయి. త్రిస్సూర్ జిల్లా అరట్టుపుజ గ్రామంలోని థారక్కల్ ఆలయంలో శుక్రవారం రాత్రి ఉత్సవ విగ్రహాల ఊరేగింపు కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంకేలో భక్తులు వచ్చారు. ఉత్సవ విగ్రహాలను ఊరేగించేందుకు రెండు ఏనుగులను తీసుకురాగా.. అందులో ఓ ఏనుగు అకస్మాత్తుగామా వటిని కింద పడేసి, మరో ఏనుగుపై దాడికి ప్రయత్నించింది. దీంతో ఆ ఏనుగు పరుగందుకుంది. దాదాపు కిలోమీటర్ దూరం పరిగెత్తింది.

We’re now on WhatsApp. Click to Join.

నియంత్రించేందుకు ప్రయత్నించిన మావటి శ్రీకుమార్ పైనా దాడి చేసింది. పైనుంచి కిందపడేయడంతో గాయపడ్డ శ్రీకుమార్ ను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో భక్తులు భయంతో పరుగులు పెట్టారు. ఈ క్రమంలో చాలామంది కిందపడి గాయాలపాలయ్యారు. విషయం తెలిసి అక్కడికి చేరుకున్న ఎలిఫెంట్ స్క్వాడ్ అతికష్టమ్మీద రెండు ఏనుగులను కంట్రోల్ చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read Also : Digvijaya Singh: 33 ఏళ్ల త‌ర్వాత లోక్‌స‌భ ఎన్నిక‌ల బ‌రిలో మాజీ సీఎం