Private Videos Murder: నగ్న చిత్రాలను షేర్ చేశాడని డాక్టర్ని హత్య చేసిన ప్రియురాలు.. ఎక్కడో తెలుసా?

ప్రేమ పేరుతో మోసం చేసిన ప్రియుడిని హతమార్చింది ఒక ప్రియురాలు. ఆమెను నగ్న చిత్రాలను ఆమెకు

  • Written By:
  • Updated On - September 20, 2022 / 05:05 PM IST

ప్రేమ పేరుతో మోసం చేసిన ప్రియుడిని హతమార్చింది ఒక ప్రియురాలు. ఆమెను నగ్న చిత్రాలను ఆమెకు తెలియకుండా సోషల్ మీడియాలో షేర్ చేసినందుకు ప్రియుడిని తన స్నేహితులతో కలిసి చంపేసింది. కాగా ఆ ప్రియురాలు ప్రియుడు ఒక డాక్టర్. అయితే సోషల్ మీడియాలో ఆమె నగ్న చిత్రాలు షేర్ చేసినట్లుగా తిరిగేయడంతో వెంటనే ఆమె అతనిపై దాడి చేసింది. ఈ ఘటనలో గాయపడ్డ ఆ వ్యక్తి ఇటీవల మరణించాడు. అసలు విషయంలోకి వెళితే.. బెంగళూరులోని డాక్టర్ వికాష్, ప్రతిప అనే అమ్మాయి ఇద్దరు ప్రేమించుకుంటున్నారు.

ఉక్రెయిన్ లో ఎంబిబిఎస్ పూర్తి చేసిన వికాస్ ఫారెన్ లో మెడికల్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామినేషన్ కోచింగ్ తీసుకోవడానికి నాలుగు నెలల క్రితం బెంగళూరుకు వెళ్ళాడు. కాగా రెండేళ్లుగా ప్రతిప తో ప్రేమాయణాయన్ని కొనసాగిస్తున్నాడు. అంతే కాకుండా వీళ్ళిద్దరికి నిశ్చితార్థం కూడా జరిగింది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ వికాష్ తన ప్రియురాలికి తెలియకుండా ఆమె న్యూడ్ ఫోటోలను తీసి తన ఫ్రెండ్ పేరుతో సోషల్ మీడియా ఖాతా తెరిచి అందులో న్యూడ్ ఫోటోలను షేర్ చేశాడు.

అంతేకాకుండా తమిళనాడులోని తన స్నేహితులకు కూడా ఈ ఫోటోలను షేర్ చేశాడు. అందుకు సంబంధించిన న్యూడ్ ఫోటోలను ప్రతిప గమనించి ప్రియుడు వికాష్ ని నిలదీసింది. అప్పుడు అతను వినోదం కోసం అలా చేశారని చెప్పడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో ప్రతిపాదన క్లాస్మేట్ అయినా చూసి అనే వ్యక్తికి తెలుపుగా అతడు ఎలా అయినా వికాష్ కీ బుద్ధి చెప్పాలని అతని స్నేహితులు గౌతమ్ సూర్య లతో కలిసి అతనిపై దాడి చేశారు. ఆ తర్వాత పథకం ప్రకారం అందరూ కలిసి అతనిపై దాడి చేసి చంపే ఉద్దేశం లేకపోవడంతో అతని తర్వాత ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స తీసుకుంటున్న అతడు తాజాగా మరణించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రియురాలితో పాటు ఆమె ఇద్దరు స్నేహితులను అరెస్టు చేయగా నిందితుడు సూర్య పరారిలో ఉన్నాడు.