10 Year Old Girl Killed: దారుణ ఘటన.. దాడిలో 10 ఏళ్ల బాలిక మృతి.!

దేవాలయాలను దోచుకుంటున్నారని అనుమానిస్తున్న కుటుంబంపై ఓ గ్రామస్థుల గుంపు దాడి చేయడంతో 10 ఏళ్ల బాలిక మృతి చెందింది.

  • Written By:
  • Updated On - November 17, 2022 / 12:58 PM IST

దేవాలయాలను దోచుకుంటున్నారని అనుమానిస్తున్న కుటుంబంపై ఓ గ్రామస్థుల గుంపు దాడి చేయడంతో 10 ఏళ్ల బాలిక మృతి చెందింది. తమిళనాడులోని పుదుకోట్టైకి చెందిన ఒక గుడిలో దొంగతనం చేశారంటూ ఆరుగురితో కూడిన కుటుంబాన్ని ఓ గుంపు వెంబడించి దాడి చచేసింది. ఆ కుటుంబంలోని 10 ఏళ్ల బాలిక ఆ గుంపు దాడి కారణంగా మరణించింది. ఆ కుటుంబంపై దుండగులు దాడికి దిగిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

నవంబర్ 14న తమిళనాడులోని పుదుకోట్టై జిల్లాలోని కిల్లనూర్ గ్రామ సమీపంలో రోడ్డుపక్కన ఉన్న దేవాలయాలను దోచుకుంటున్న సమూహం దొరికిందని వాట్సాప్‌లో సందేశాలు వైరల్ అయ్యాయి. ఆటో రిక్షాలో ప్రయాణిస్తున్న ఆరుగురు బయటి వ్యక్తుల గుంపును గుర్తించిన గ్రామస్తులు వారి వాహనాన్ని వెంబడించారు. ఆటో రిక్షాను చుట్టుముట్టిన గ్రామస్థుల ముఠా మచ్చువడి సమీపంలో ఆపి కుటుంబ సభ్యులపై దారుణంగా దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని కడలూరుకు చెందిన కుటుంబాన్ని రక్షించారు.

గ్రామస్థుల గుంపు వారిపై దాడి చేసిన వీడియో కూడా వైరల్‌గా మారింది. దాడి అనంతరం కుటుంబీకులను పోలీసులు పుదుకోట్టై ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. గుంపు దాడిలో తీవ్రంగా గాయపడిన చిన్నారి బుధవారం సాయంత్రం మరణించింది. చిన్నారి తల్లి లిల్లీ పుష్ప గణేష్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె తన కుటుంబంతో కలిసి రెండు నెలల నుండి కడలూరు నుండి ఆటో రిక్షాలో వరుస ఆలయాలను సందర్శించడానికి బయలుదేరినట్లు పేర్కొంది. నవంబర్ 14న కిల్లనూరు సమీపంలో ముగ్గురు వ్యక్తులు ఆమెతో గొడవ పడ్డారని, ఆమె భర్త సత్యనారాయణస్వామి జోక్యం చేసుకోవడంతో వారు ఆమెపై దాడికి దిగారని ఫిర్యాదులో పేర్కొంది. గుంపు తమను వెంబడించడం ప్రారంభించిందని కూడా ఆమె పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉంటే ఆ కుటుంబ సభ్యులు దొంగిలించారని ఆరోపించిన వస్తువులకు సంబంధించిన మరో వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.