తెలుగు రాష్ట్రాల్లో కుక్కల దాడులు ఆగడం లేదు. కుక్కల దాడి నుంచి తాజాగా ఓ బాలిక తృటిలో తప్పించుకుంది. తెలంగాణలోని సిద్దిపేట(D) కోహెడలో స్కూలు నుంచి ఇంటికి వెళ్తున్న బాలికను 2 కుక్కలు వెంటాడగా.. చిన్నారి అరుస్తూ పరుగులు పెట్టింది. ఆమె అరుపులు విన్న ఓ వ్యక్తి తన చేతిలో ఉన్న వస్తువును విసరడంతో కుక్కలు పారిపోగా.. చిన్నారి ఊపిరి పీల్చుకుంది. దీనికి సంబంధించి సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డయ్యాయి.