దేశవ్యాప్తంగా జియో సేవలు నిలిచిపోయాయి. దీంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా మంది జియో వినియోగదారులు ఉదయం నుంచి కాల్స్ వెల్లడం లేదంటూ దీనిపై పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. చాలామంది జియో యూజర్లు ఉదయం నుంచి మెసేజ్ లు పంపలేకపోతున్నామని పేర్కొన్నారు. ఉదయం నుంచి తన మొబైల్లో VoLTE గుర్తు కనిపించడం లేదంటూ ట్విట్టర్ లో పోస్టు పెడుతున్నారు. తమకు ఇన్ కమింగ్, ఔట్ గోయింట్ కాల్స్ వెల్లడం లేదంటున్నారు. సాధారణ కాల్స్ లోనే ఇలాంటి సమస్య తలెత్తుతే మీరు 5జీ సేవలను ఎలా అందిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
#Jiodown what's the new shit!! Early morning!!! @reliancejio look into it!! Can't make calls neither use internet!!!
— SIDDHESH JADHAV®️🇮🇳 (@Siddhes74106361) November 29, 2022
ఇంటర్నెట్ బాగా పనిచేస్తుంది కానీ కాని కొంతమంది యూజర్లు మొబైల్ డేటా పనిచేయడం లేదంటూ ఫిర్యాదు చేస్తున్నారు. ఎస్ఎంఎస్ లు పంపించడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొవల్సి వస్తుందంటున్నారు. ప్రస్తుతం # JioDown మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ట్రెండింగ్ లో ఉంది. కమ్యూనికేషన్ లేకపోవడం వల్లే తన ఫ్లైట్ మిస్సయిందని ఓ యూజర్ ట్విట్ చేశాడు. దీనికి ఎవరు పరిహారం చెల్లిస్తారంటూ ప్రశ్నించాడు.
Jio Outage: Hundreds of #Jio users face issues with calling as network goes down in India#JioDown #RelianceJio #JioOutage #JioNotWorkinghttps://t.co/iZXra1d2W8
— Express Technology (@ExpressTechie) November 29, 2022