Gurugram : 10వ తరగతి విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ ..అపస్మారకస్థితిలో రోడ్డుపై బాలిక..!!

  • Written By:
  • Publish Date - November 1, 2022 / 05:07 AM IST

హర్యానాలోని గురుగ్రామ్ లో దారుణం జరిగింది. పదవ తరగతి విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. విద్యార్థినిపై ఆమె ఇద్దరు స్నేహితులతోపాటు మొత్తం ఐదుగురు ఈ ఘటనకు పాల్పడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. తన స్నేహితులతోపాటు హోటల్ కు వెళ్లిన బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఈ ఘటన శనివారం రాత్రి జరిగింది. ఐదుగురు నిందితులలో ఇద్దరు బాలిక స్నేహితులు.

విద్యార్థిని శనివారం మధ్యాహ్నం 12:30గంటల ప్రాంతంలో ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. తన కూతురు సమీపంలోని పార్క్ లో వాకింగ్ కు వెళ్లిందని తల్లిదండ్రులు భావించారు. కానీ కూతురు సాయంత్రం అయినా తిరిగి రాకపోవడంతో వెతకడం ప్రారంభించినా ఆచూకీ లభించలేదని బాధితురాలి తల్లిదండ్రులు తెలిపారు. మరసటి రోజు ఆదివారం ఉదయం 10గంటలకు ఇంటికి సమీపంలో తమ కుమార్తె అపస్మారక స్థితిలో ఉండటాన్ని గమనించామని తెలిపారు.

రాత్రంతా ఎక్కడ ఉన్నావ్ తల్లి నిలదీయడంతో …తన స్నేహితులు హోటల్ కు తీసుకెళ్లారని…అప్పటికే ముగ్గురు వ్యక్తులు అక్కడ ఉన్నారని విద్యార్థిని తెలిపింది. తనపై అత్యాచారం చేశారని చెప్పింది. ఈ విషయం ఎవరికై చెబితే చంపేస్తామని నిందితులు బెదిరించారని విద్యార్థిని తెలిపింది. విద్యార్థిని తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో ఐపీసీ సెక్షన్ 376డి పోక్స్ చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అత్యాచారం జరిగినట్లు వైద్యులు నిర్దారించారని పోలీసులు తెలిపారు. సోమవారం సాయంత్రం ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు డీసీపీ దీపక్ సహారన్ తెలిపారు. మరో ముగ్గురిని త్వరలోనే పట్టుకుంటామన్నారు.