Viral Tweet : రాహుల్ గాంధీ, పూనమ్ కౌర్ ఫోటోను ట్వీట్ చేసిన బీజేపీ నేతపై నెటిజన్లు ఫైర్..!!

  • Written By:
  • Publish Date - October 30, 2022 / 06:54 AM IST

కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలో కొనసాగుతోంది.  శనివారం ఈ యాత్రలో సినీనటి పూనమ్ కౌర్ కూడా పాల్గొన్నారు. రాహుల్ గాంధీతోపాటు ఆమె నడిచారు. రాహుల్ గాంధీ చేయి పట్టుకుని పూనమ్ కౌర్ నడుస్తున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూనమ్ కౌర్ కాంగ్రెస్ లోకి వెళ్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా..కర్నాటక బీజేపీ నాయకురాలు ప్రీతీగాంధీ రాహుల్ గాంధీ, పూనమ్ కౌర్ ఉన్న ఫొటోను ట్వీట్ చేశారు. దీంతో ఆమె ట్రోల్ బారిన పడ్డారు.

రాహుల్ గాంధీ, పూనమ్ కౌర్ ఫోటోను షేర్ చేస్తూ…రాహుల్ గాంధీ తన ముత్తాత అడుగుజాడల్లో నడుస్తున్నారు చాలా గ్రేట్ అంటూ క్యాప్షన్ జోడించారు. దీంతో ప్రీతీగాంధీపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. రకరకాల కామెంట్స్ చేస్తూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ ట్వీట్ పై నటి పూనమ్ కౌర్ కూడా స్పందించారు. ఇది చాలా అవమానకరమైంది. మహిళా శక్తి గురించి ప్రధానమంత్రి మోదీ మాట్లాడిన విషయాలను మీరు గుర్తుంచుకోండి. నేను జారి పడిపోతున్న సమయంలో రాహుల్ సార్ అలా నా చెయ్యి పట్టుకున్నారు అంటూ పూనమ్ కౌర్ రీట్వీట్ చేశారు.

యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్ తీవ్రంగా మండిపడ్డారు. ఒక మహిళ గురించి మరో మహిళ ఇలా మాట్లాడటం సిగ్గు చేటు అన్నారు. మీరు సమయం వృధా చేసుకోకుండా వెంటనే చికిత్స చేయించుకోండి. మీ మానసిక స్థితి బాగలేనట్లుంది అంటూ గుజరాత్ కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేడా సలహా ఇచ్చారు. ఇది మీకు మీ కుటుంబానికి చాలా హానికరం అంటూ సెటైర్లు వేశారు.