Bihar : విద్యార్థినిపై అత్యాచారం చూసి అడ్డుకోవాల్సిన ఉపాధ్యాయుడు తానుకూడా..!!

  • Written By:
  • Updated On - November 29, 2022 / 11:40 AM IST

బీహార్ లోని కైమూర్ జిల్లాలో సమాజం తలదించుకునే ఘటన జరిగింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే నీచమైనపనికి పాల్పడ్డాడు. పూర్తివివరాలు చూస్తే..14ఏళ్ల మైనర్ బాలిక స్థానిక పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. ఆ విద్యార్థిని కాలక్రుత్యాలు తీర్చుకునేందుకు నిర్జన ప్రదేశానికి వెళ్లింది. అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఆమెను ఏకాంత ప్రదేశానికి లాక్కెళ్లాడు. ఆ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటనాస్థలంలో ఆ వ్యక్తితోపాటు తన ముగ్గురు స్నేహితులు కూడా ఉన్నారు. విద్యార్థిని అరుపులు విన్న ఉపాధ్యాయుడు అక్కడి వచ్చాడు. బాలికపై అత్యాచారం జరుగుతుంటే అడ్డుకోవాల్సిన ఉపాధ్యాయుడు తాను అత్యాచారానికి పాల్పడ్డారు. అక్కడున్న వారు చూసి ఆనందించారు కానీ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. నిర్జన ప్రదేశంలోనే విద్యార్ధిని వదిలేసి అక్కడి నుంచి పారిపోయారు.

ఇంటికి చేరుకున్న ఈ విషయాన్ని తన తల్లికి చెప్పింది. ఆ బాలిక తల్లిదండ్రులు వెంటనే మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బాలిక ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకున్నారు. మిగతా నలుగురి కోసం గాలింపు చేపట్టారు. మైనర్ అత్యాచారం కేసులో నిందితుడైన ఓ వ్యక్తితోపాటు ఉపాధ్యాయుడిపై 376డిఏ, పోక్సో చట్టం 6, ఎస్సీ ఎస్టీ కింద కేసు నమోదు చేశారు. విచారణల మరిన్న విషయాలు వెలుగులో వచ్చే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.