Kohlis@Paris: ఫ్యామిలీతో పారిస్ లో కోహ్లీ వెకేషన్

టీమిండియా మాజీ కెప్టెన్ రిలాక్స్ అవుతున్నాడు. ఫామ్ కోసం తంటాలు పడుతూ విమర్శలు ఎదుర్కొంటున్న కోహ్లీ కొన్ని రోజుల పాటు మైదానానికే దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు.

  • Written By:
  • Updated On - July 21, 2022 / 10:16 AM IST

టీమిండియా మాజీ కెప్టెన్ రిలాక్స్ అవుతున్నాడు. ఫామ్ కోసం తంటాలు పడుతూ విమర్శలు ఎదుర్కొంటున్న కోహ్లీ కొన్ని రోజుల పాటు మైదానానికే దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో కుటుంబంతో కలిసి సరదాగా గడుపుతున్నాడు. తాజాగా కోహ్లీ ప్యారిస్ లో ల్యాండయ్యాడు. ఈ విషయాన్ని కోహ్లి భార్య అనుష్క తన ఇన్‌స్టా స్టోరీ ద్వారా వెల్లడించింది.

పారిస్‌లో ఎండలు మండిపోతున్నాయని, అక్కడ 41 డిగ్రీల ఎండ నమోదవుతున్నట్లు ఆమె ఇన్‌స్టాలో పేర్కొంది. కోహ్లీతో పారిస్ లో ఉన్న ఫోటోలను కూడా అనుష్క ఫ్యాన్స్ తో పంచుకుంది. కాగా, గతకొంతకాలంగా ఫామ్‌ లేమితో సతమతమవుతున్న కోహ్లి రెస్ట్‌ పేరుతో విండీస్‌ పర్యటనకు దూరంగా ఉన్నాడు. రెస్ట్ కావాలంటూ అతను చేసిన రిక్వెస్టును సెలక్టర్లు అంగీకరించి విండీస్ టూర్ కు ఎంపిక చేయలేదు. క్రికెట్‌కు కొన్నాళ్ల పాటు దూరంగా ఉంటే తిరిగి‌ గాడిలో పడతాడనే ఉద్దేశంతో కోహ్లి విండీస్‌ పర్యటనకు వెళ్లకుండా ఫ్యామిలీతో పాటు గడుపుతున్నట్టు తెలుస్తోంది.

మళ్ళీ కోహ్లీని గ్రౌండ్ లో చూడాలంటే ఆసియా కప్ వరకూ వేచి చూడాల్సిందేనని సమాచారం. ప్రస్తుతం కోహ్లీ కెరీర్ లోనే అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. ఇటీవల ముగిసిన ఇంగ్లండ్ పర్యటనలోనైనా కోహ్లి ఫామ్‌లోకి వస్తాడని అంతా ఆశించారు. అయితే కోహ్లి మాత్రం టెస్ట్, వన్డేల్లో తీవ్రంగా నిరాశపరిచాడు. విండీస్ టూర్ తర్వాత భారత్ ఆసియా కప్ ఆడనుండగా.. అప్పటికి కోహ్లీ అందుబాటులో ఉండనున్నాడు. ఆసియాకప్ ఆగష్ట్ 27 నుంచి మొదలుకానుంది.