అమ్మాయిలు చాలామంది ఎక్కువగా ముఖం చేతులు మెడ భాగాలపై చూపించినంత శ్రద్ధ పాదాల విషయంలో అంతగా తీసుకోరు. దాంతో పాదాలు నల్లగా నిర్జీవంగా మారుతాయి. అయితే కొంతమంది పాదాలు కూడా తరచూ శుభ్రంగా ఉంచుకుంటూ ఉంటారు. ఇలా ఉంచుకోవడం వల్ల పాదాలు తెల్లగా మారుతాయి. నల్లగా మారిన పాదాలు తెల్లగా మెరవాలంటే ఏం చేయాలో,అందుకోసం ఎటువంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
శనగపిండి – పెరుగు : పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ సున్నితమైన ఎక్స్ఫోలియేటర్గా పనిచేస్తుంది. ట్యాన్ను తొలగించే గుణాలు కూడా ఉన్నాయి. శెనగపిండి లోని పోషకాలు చర్మంపై పేరుకున్న డెడ్ సెల్స్, వ్యర్థాలను తొలగిస్తాయి. మీరు టాన్ ప్యాక్ తయారు చేసుకోవడానికి 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 3 టేబుల్ స్పూన్ల పెరుగు తీసుకుని పేస్ట్లా తయారు చేసి, మీ పాదాలపై ఈ ప్యాక్ అప్లై చేసి 30 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత మీ చేతితో సున్నితంగా స్క్రబ్ చేసి గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేయాలి. ఆ తర్వతా మాయిశ్చరైజర్ అప్లై చేయాలి.
బంగాళదుంప – నిమ్మరసం : బ్లాక్ హెడ్స్, నల్లటి మచ్చలకు బంగాళదుంపు ఎంతో బాగా పనిచేస్తుంది. బంగాళదుంపలో కాటెకోలేస్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది నల్లమచ్చలను దూరం చేస్తుంది. ఇది నల్లగా మారిన పాదాలకు చక్కని ఛాయను అందిస్తుంది. ఇందుకోసం ఒక బంగాళాదుంప పేస్ట్, 1 నిమ్మకాయ రసాన్ని మిక్స్ చేస్తి పేస్ట్ చేసిదానిని మీ పాదాలకు అప్లై చేసి 20- 30 నిమిషాలు ఆరనిచ్చి, చల్లటి నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల పాదాలపై ఉన్న నలుపు. పోతుంది.
కాఫీ – కొబ్బరి నూనె : కాఫీ పొడి చర్మానికి మంచి స్క్రబ్గా పనిచేస్తుంది. ఇది చర్మంపై పేరుకున్న డెడ్ సెల్స్ను తొలగిస్తుంది. కాఫీలో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి చర్మాన్ని కాంతివంతం చేస్తాయి. కొబ్బరి నూనె చర్మాన్ని తేమను అందించి మెరుపు ఇస్తుంది. రెండు టేబుల్ స్పూన్ల కాఫీ పొడిలో, రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె వేసి పేస్ట్లా చేయాలి. దీనిని పాదాలకు అప్లై చేసి 10 నుంచి 15 నిమిషాల పాటు ఆరనిచ్చి,ఆ తర్వాత చేతివేళ్లతో సున్నితంగా స్క్రబ్ చేసి,ఆ తర్వాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేస్తే పాదాలపై నలుపు తగ్గుతుంది.