మామూలుగా చాలామంది రొయ్యలతో చేసిన వంటకాలను తెగ ఇష్టపడుతూ ఉంటారు. రొయ్యల వేపుడు, రొయ్యల ఇగురు, రొయ్యల కర్రీ, రొయ్యల మసాలా కర్రీ లాంటి వంటకాలు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఎక్కువ శాతం మంది రొయ్యల బిర్యానీ ఇష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా రెస్టారెంట్ స్టైల్ లో బిర్యాని చేసుకొని తినాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఆ బిర్యానీని ఎలా చేసుకోవాలి. దానికి ఏ పదార్థాలు కావాలి అన్న విషయాలు చాలా మందికి తెలియదు. ఆ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
రొయ్యల బిర్యానీకి కావలసిన పదార్థాలు:
బియ్యం – 1 కేజీ
రొయ్యలు – కేజీన్నర
పెరుగు – 200 గ్రాములు
నిమ్మరసం – 3 టీస్పూన్లు
కారంపొడి- 20 గ్రాములు
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 100 గ్రాములు
ఉప్పు – 50 గ్రాములు
గరంమసాలా – 20 గ్రాములు
రిఫైన్డ్ ఆయిల్ – 100 గ్రాములు
వేయించిన ఉల్లి ముక్కలు – 30 గ్రాములు
జీడిపప్పు – కొద్దిగా
కొత్తిమీర తరుగు – 15 గ్రాములు
పుదీనా తరుగు – 15 గ్రాములు
బిర్యానీ ఆకులు – 5 గ్రాములు
డాల్డా లేదా నెయ్యి – 150 గ్రాములు
నీళ్లు – 5 లీటర్లు
రొయ్యల బిర్యానీ తయారీ విధానం :
ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలో రొయ్యలు వేసి వాటిలో నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, వేయించిన ఉల్లి ముక్కలు, పెరుగు, కొత్తిమీర, పుదీనా తరుగు, ధనియాల పొడి, నూనె వేసి బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న ఆ మిశ్రమాన్ని అరగంట పాటు అలాగే ఉంచాలి. తర్వాత కుక్కర్ పెట్టి ఆయిల్ ఇంకా నెయ్యి వేసుకుని అందులో లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, పుదీనా, కొత్తిమీర వేసి బాగా వేయించుకుని, సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకొని గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇపుడు అందులో మనం ముందుగా మార్నేట్ చేసి పెట్టుకున్న రొయ్యల మిశ్రమాన్ని కూడా వేసుకొని, అందులో వచ్చిన నీళ్లు అంత ఆవిరి అయ్యేవరకు ఉంచాలి. తర్వాత బియ్యానికి సరిపడా నీళ్లు వేసి ఉప్పు చూసుకొని, బాగా మరిగాక కడిగి పెట్టుకున్న బియ్యాన్ని నీళ్లు లేకుండా చూసుకొని మసులుతున్న నీళ్లలో వేసి ఒకసారి బాగా కదిపి కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చాక, కాసేపు చిన్నమంటపై ఉంచాలి. 20 నిమిషాల తర్వాత మూతను తీసి కొత్తిమీర, పుదీనాల తరుగు, జీడిపప్పు, వేగించిన ఉల్లిపాయ ముక్కలతో అలంకరించాలి. అంతే రుచికరమైన రొయ్యల బిర్యానీ రెడీ.