గ్రేటర్ నోయిడాలో ఓ మహిళ నేరానికి పాల్పడింది. ఓ మహిళను తెచ్చి తన ఫ్లాట్లో చంపేసి తానే మరణించినట్టు నమ్మించింది ఓ యువతి. తన ప్రియుడితో కలిసి ఈ దారుణానికి పాల్పడింది.ఇటీవల మరణించిన మహిళ కుటుంబ సభ్యులు మిస్సింగ్ ఫిర్యాదు పోలీసులకు ఇవ్వడంతో కేసు దర్యాప్తు మొదలైంది. పలు అనుమానాలతో గుట్టుగా జీవిస్తున్న ఆ జంటను విచారించగా అసలు విషయం బయటపడింది.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. నిందితురాలిని పాయల్గా గుర్తించారు. గ్రేటర్ నోయిడాకు 15 కిలోమీటర్ల దూరంలోని బాధ్పురా నివాసి. ఆమె లవర్ అజయ్ ఠాకూర్. పాయల్ బాధితురాలితో ఫ్రెండ్ షిప్ చేసింది. ఆమెకు అజయ్ కూడా తెలుసు. గ్రేటర్ నోయిడాలోని గౌర్ సిటీ ఏరియాలో ఓ మాల్లో పని చేసేది. ప్లాన్ ప్రకారం ఆ యువతిని పాయల్ ఇంటికి తీసుకెళ్లారు. ఆమె గొంతు కోసి చంపేశారు. ఆమె ముఖంపై యాసిడ్, వేడి నూనె పోసి ఆనవాళ్లు గుర్తించకుండా చేశారు. ఆ బాడీని తన కుటుంబ సభ్యులు తనదే అనుకునేలా చేసి అక్కడి నుంచి పార్ట్నర్ అజయ్తో కలిసి పారిపోయింది. ఆ డెడ్ బాడీ పాయల్దే అనుకుని బంధువులు అంత్యక్రియలు కూడా నిర్వహించారు.
కానీ.. మరణించిన మహిళ కుటుంబ సభ్యులకు పోలీసులకు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. వారి దర్యాప్తు అసలు ఘటన వైపు సాగింది. పాయల్, అజయ్లపై అనుమానంతో వారిని విచారించారు. దింతో వారు నేరం చేశామని ఒప్పుకున్నారు. రవీంద్ర భాటి, రాకేష్ దేవి దంపతులకు పాయల్ ఏకైక కుమార్తె అని బద్పురా పోలీసులు తెలిపారు. పాయల్ తండ్రి తమ బంధువులకు డబ్బులు ఇవ్వాల్సి ఉన్నది. మరో దారి లేక పాయల్ తల్లిదండ్రులు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. తల్లిదండ్రులు ఆత్మహత్య తర్వాత పాయల్ తాను మరణించినట్టు నమ్మించాలని నిర్ణయం తీసుకుంది. అందుకే ఒక ప్లాన్ ప్రకారమే ఈ నేరానికి పాల్పడిందని పోలీసులు తెలిపారు.