Site icon HashtagU Telugu

Shocking : కలియుగ భార్యామణి.. భర్త కిడ్నీ అమ్మి.. వచ్చిన డబ్బులతో ప్రియుడితో పరార్‌..

Extramarital Affair

Extramarital Affair

Shocking : పశ్చిమ బెంగాల్‌లోని హౌరా జిల్లాలో ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఇక్కడ ఒక మహిళ తన భర్తను బలవంతంగా కిడ్నీ అమ్మమని ఒత్తిడి చేసింది. ఆమె చెప్పినట్లుగా, కిడ్నీ అమ్మకం ద్వారా వచ్చే రూ. 10 లక్షలు ఆమె కూతురి చదువుకు ఉపయోగపడుతాయని ఆమె భర్తను నమ్మించి, అతనికి కిడ్నీ అమ్మమని బలవంతం చేసింది. భర్త గుడ్డిగా తన భార్య మాట నమ్మాడు, కానీ ఆమె ఈ సమయం మొత్తంలో తన ఉద్దేశాన్ని దాచింది. కిడ్నీ అమ్మకంతో వచ్చిన డబ్బును తన దగ్గర ఉంచుకుని, తరువాత రాత్రికి రాత్రే ఆమె తన ప్రేమికుడితో పారిపోయింది.

Union Budget 2025 : తెలంగాణకు అన్యాయం – కేటీఆర్

ఈ సంఘటన హౌరా జిల్లా సంక్రైల్ ప్రాంతంలో చోటు చేసుకుంది. బాధితుడు తన భార్య , 10 సంవత్సరాల కుమార్తెతో కలిసి నివసిస్తున్నాడు. అతని ఆదాయం తన కూతురి చదువు కోసం సరిపోవడం లేదు.. దీంతో.. భార్య తన భర్తను కిడ్నీ అమ్మమని ఒత్తిడి చేసింది. ఈ ఒత్తిడి నుంచి నమ్మకంగా ఉన్న భర్త, తన కూతురి భవిష్యత్తు కోసం తన కిడ్నీ అమ్మాలని నిర్ణయించుకున్నాడు.

భర్త నెల రోజుల పాటు కిడ్నీ అమ్మేవారిని వెతికాడు. అప్పుడు అతని కిడ్నీ రూ. 10 లక్షలకు బేరం కుదిరింది. ఆపరేషన్‌ చేసిన తర్వాత రూ.10 లక్షల డబ్బుతో ఇంటికి వచ్చాడు. అయితే.. తెచ్చిన డబ్బు భార్య తనకు ఇవ్వాలని అడగడంతో… భార్యపై నమ్మకంతో భర్త ఆమెను నమ్మి ఆ డబ్బు ఇచ్చాడు. కానీ, ఆమె ఆ డబ్బును తీసుకుని రాత్రి ఇంటి నుంచి పారిపోయింది. కొన్ని రోజులు తరువాత, భర్త తన భార్యను బరాక్‌పూర్‌లోని సుభాష్ కాలనీలో ఉండగా గుర్తించాడు.

అయితే, తన భర్తను చూసిన ఆమె “ఏం చేసుకుంటావో చేసుకో, నాకు విడాకులు పంపిస్తావా పంపు” అంటూ గట్టిగా అరిచి.. నానా రాద్దాంతం చేసింది. ఈ సంఘటన మరింత దారుణంగా మారింది. ఆ పరిస్థితిలో కూడా ఆమె తన పదేళ్ల కూతురి గురించి ఆలోచించకపోవడం అక్కడివారిని కలిచివేసింది.. అయితే.. ఈ ఘటనపై పెయింటర్ రవిదాస్ , భార్యపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేయబడింది. ఇప్పుడు ఈ కేసులో ఆ తర్వాత ఏజరుగుతుందో చూడాలి..

Congo Clashes: కాంగోలో మారణహోమం.. 778 మంది మృతి.. ఎక్కడ చూసిన రక్తపు ముద్దలు