Foxconn – Padma Bhushan : యాంగ్ లీకి పద్మభూషణ్.. ఇండియాలో తైవాన్ వెలుగులు.. ఎవరాయన ?

Foxconn - Padma Bhushan : వ్యాపార, పారిశ్రామిక రంగాలకు చెందిన నలుగురికి భారత ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. 

  • Written By:
  • Publish Date - January 26, 2024 / 09:40 AM IST

Foxconn – Padma Bhushan : వ్యాపార, పారిశ్రామిక రంగాలకు చెందిన నలుగురికి భారత ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది.  వీరిలో యాంగ్ లీ (తైవాన్), సీతారామ్ జిందాల్ (కర్ణాటక)లకు పద్మభూషణ్ అనౌన్స్ చేశారు. ఇక కల్పనా మోర్పారియా (మహారాష్ట్ర), శశి సోనీ (కర్ణాటక)లక పద్మశ్రీ దక్కింది.  ఇంతకీ యాంగ్ లీ ఎవరు ? అనుకుంటున్నారా ? ఈయన మరెవరో కాదు.. తైవాన్‌కు చెందిన దిగ్గజ మల్టీనేషనల్ ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ మానుఫ్యాక్చరర్ సంస్థ  ఫాక్స్‌కాన్ (హాన్ హై టెక్నాలజీ గ్రూప్) అధిపతి. ఆ కంపెనీ సీఈఓ అండ్ ఛైర్మన్‌ హోదాలో యాంగ్ లీ సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం భారత్‌లో సెమీ కండక్టర్ పరిశ్రమకు యాంగ్ లీ కీలకమైన సహాయ సహకారాలను అందిస్తున్నారు. కరోనా సంక్షోభం చైనాను కుదిపేసినప్పటి నుంచి ఫాక్స్‌కాన్ కంపెనీ తమ పెట్టుబడుల్ని ఇండియాకు డైవర్ట్ చేస్తోంది. ఇప్పటికే తెలంగాణ, కర్ణాటకల్లో తమ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. తమిళనాడులో ఈ కంపెనీకి ఐఫోన్ తయారీ యూనిట్ సైతం ఉంది. మార్కెట్ విలువ పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీల్లో ఒకటైన ఐఫోన్ల తయారీ సంస్థ యాపిల్‌. యాపిల్ కంపెనీ కోసం ఐఫోన్లను తయారు చేసి సప్లై చేసేది ఫాక్స్‌కాన్ కంపెనీయే.  ఈ నేపథ్యంలో ఫాక్స్‌కాన్  సీఈవో యాంగ్ లీకి భారత్‌లోనే మూడో అతిపెద్ద పౌర పురస్కారం(Foxconn – Padma Bhushan) లభించడం విశేషం.

We’re now on WhatsApp. Click to Join.

  • 1988లో మైక్రో సిస్టమ్స్ అనే మదర్‌బోర్డ్ తయారీ కంపెనీని యాంగ్ లీ ప్రారంభించారు.
  • 1995లో PC చిప్‌సెట్ కోసం నార్త్‌బ్రిడ్జ్ అండ్ సౌత్‌బ్రిడ్జ్ ఐసీ డిజైన్ కంపెనీ స్థాపించారు.
  • 1997లో ITE టెక్ అండ్ ADSL IC డిజైన్ కంపెనీ ITeX ను ప్రారంభించారు.
  • యాంగ్ లీ 1986లో యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా నుంచి కంప్యూటర్ ఇంజినీరింగ్‌లో M.S. డిగ్రీ చేశారు.
  • 1978లో తైవాన్ నేషనల్ చియావో తుంగ్ యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రోఫిజిక్స్‌లో B.S. డిగ్రీ చేశారు.

Also Read :Republic Day 2024 : మన రిపబ్లిక్ డే చారిత్రక విశేషాలు ఇవిగో

  • వాణిజ్య రంగంలో పద్మభూషణ్ వరించిన సీతారామ్ జిందాల్.. జిందాల్ అల్యూమినియం కంపెనీ వ్యవస్థాపకుడు, సీఎండీ.  ఈయన హరియాణాలో జన్మించారు. నాచురోపతిలో డాక్టరేట్ డిగ్రీ పొందారు. 1978లోనే బెంగళూరులో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నాచురోపతి అండ్ యోగా హాస్పిటల్‌ను నిర్మించారు.
  • పద్మశ్రీ దక్కిన కల్పనా మోర్పారియా.. ఐసీఐసీఐ బ్యాంక్, జేపీ మోర్గాన్ సంస్థల్లో దీర్ఘకాలం పని చేశారు. ప్రస్తుతం పలు కంపెనీల బోర్డుల్లో ఉన్నారు. ఐజ్మో లిమిటెడ్‌కు ఛైర్‌పర్సన్‌గా ఉన్న శశి సోనీ.. రూ .10 వేలతో మొదలుపెట్టి 500 మిలియన్ డాలర్ల కంపెనీగా తీర్చిదిద్దారు.