Site icon HashtagU Telugu

Masood Azhar: ‘ఆపరేషన్ సిందూర్‌’తో వణికిపోయిన మసూద్ అజార్ ఎవరు ?

Masood Azhar Most Wanted Terrorist Operation Sindoor India Pakistan

Masood Azhar: కరుడుగట్టిన పాక్ ఉగ్రవాది,  జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజార్‌ను భారత సైన్యం చావుదెబ్బ తీసింది. రక్త కన్నీరు వచ్చేలా చేసింది.  ఇవాళ (బుధవారం) తెల్లవారుజామున భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్‌లో మసూద్ అజార్‌కు చెందిన దాదాపు 14 మంది కుటుంబీకులు, సన్నిహితులు హతమయ్యారు. దీంతో అతడు ప్రస్తుతం ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నాడు. భారత సైన్యాన్ని తలుచుకొని మసూద్ వెక్కివెక్కి ఏడుస్తున్నాడు. ఇంతకీ ఇతడి నేపథ్యమేంటి ? ఒకప్పుడు భారత్‌కు చిక్కిన మసూద్ అజార్.. ఎలా రిలీజ్ అయ్యాడు ? పాకిస్తాన్‌లో అతడికి ఎన్ని ఉగ్రవాద ఫ్యాక్టరీలు ఉన్నాయి ? తెలుసుకుందాం..

Also Read :Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై ప్రెస్‌మీట్.. వ్యోమిక, సోఫియా నేపథ్యమిదీ

మసూద్ అజార్ నీచమైన నేపథ్యం.. 

విమానం హైజాకింగ్.. మసూద్ అజార్ విడుదల 

ఉగ్రవాది మసూద్ అజార్(Masood Azhar) ఒకప్పుడు భారత దర్యాప్తు సంస్థల అదుపులోనే ఉండేవాడు. అయితే 1999 డిసెంబర్‌లో కీలక ఘటన జరిగింది. నేపాల్‌లోని ఖాట్మండు నుంచి ఢిల్లీకి బయల్దేరిన ఐసీ814 విమానాన్ని మసూద్ అజార్ సన్నిహితులు హైజాక్  చేశారు. దాన్ని అమృత్‌సర్, లాహోర్, దుబాయ్ మీదుగా ఆఫ్ఘనిస్తాన్‌లోని కాందహార్‌కు తీసుకెళ్లారు. భారతదేశ దర్యాప్తు సంస్థల అదుపులో ఉన్న బందీలను విడుదల చేస్తేనే, విమానంలో ఉన్నవారిని విడిచిపెడతామని ఉగ్రవాదులు డిమాండ్ చేశారు. దీంతో విమానంలోని ప్రజల ప్రాణాలను కాపాడేందుకు మసూద్ అజార్‌తో పాటు మరో ఇద్దరు ఉగ్రవాదులను భారత్ విడుదల చేసింది.

Also Read :Masood Azhar : ‘ఆపరేషన్ సిందూర్‌’‌తో మసూద్ అజార్ రక్త కన్నీరు.. ‘‘నేనూ చనిపోతే బాగుండేది’’