UPSC Prelims: నేడు UPSC సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష.. అభ్యర్థులు తమ వెంట ఇవి తీసుకెళ్లాల్సిందే..!

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష (UPSC Prelims) నేడు జరగనుంది.

  • Written By:
  • Publish Date - May 28, 2023 / 07:39 AM IST

UPSC Prelims: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష (UPSC Prelims) నేడు జరగనుంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నిర్వహించనున్న సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ (సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ 2023) ఈరోజు మే 28, 2023న రెండు షిఫ్టుల్లో నిర్వహించబడుతుంది. పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులు ఇప్పటికే అధికారిక వెబ్‌సైట్‌లో విడుదలయ్యాయి. అభ్యర్థులు ఈ అడ్మిట్ కార్డులతో నేడు నిర్ణీత పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి.

పరీక్ష రెండు షిఫ్ట్‌లలో నిర్వహించబడుతుంది. జనరల్ స్టడీస్ పేపర్- I (GS- I) ఉదయం 9.30 నుండి 11.30 వరకు, సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (CSAT) మధ్యాహ్నం 2.30 నుండి 4.30 వరకు నిర్వహించనున్నారు. అదే సమయంలో పరీక్షకు వెళ్లే అభ్యర్థులు కూడా కొన్ని మార్గదర్శకాలను జాగ్రత్తగా చూసుకోవాలి. అవేంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం.

Also Read: Gold Rates: ఈరోజు కూడా తగ్గిన పసిడి ధరలు.. నిన్నటితో పోలిస్తే నేటి రేట్స్ ఎలా ఉన్నాయో తెలుసా..?

రూల్స్

– అభ్యర్థులందరూ అడ్మిట్ కార్డ్‌తో పాటు ఒక ఫోటో ఐడి ప్రూఫ్‌ని తీసుకెళ్లడం తప్పనిసరి. అది ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి కార్డ్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ కూడా కావచ్చు.

– అభ్యర్థులు తప్పనిసరిగా రెండు ఇటీవలి పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్‌లను తీసుకెళ్లాలి. రెండు ఫోటోగ్రాఫ్‌లు ఎందుకంటే ప్రతి షిఫ్ట్‌కి ప్రత్యేక ఫోటో అవసరం కావచ్చు. వాస్తవానికి అడ్మిట్ కార్డ్‌పై ఉన్న ఫోటో స్పష్టంగా లేకుంటే అస్పష్టంగా ఉంటే అభ్యర్థి ముఖం స్పష్టంగా కనిపించకపోతే అభ్యర్థి ఇటీవల ఇచ్చిన ఫోటో నుండి ధృవీకరణ చేయబడుతుంది.

– పరీక్ష సమయంలో చివరి నిమిషంలో రద్దీని నివారించడానికి అభ్యర్థులు పరీక్ష సమయానికి కనీసం ఒక గంట ముందుగా నిర్దేశించిన కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ఈ మేరకు కమిషన్ జారీ చేసిన సమాచారంలో పేర్కొంది. పరీక్ష ప్రారంభానికి 10 నిమిషాల ముందు అంటే మొదటి షిఫ్ట్‌కు ఉదయం 9.20 గంటలకు, మధ్యాహ్నం సెషన్‌కు మధ్యాహ్నం 2.20 గంటల తర్వాత పరీక్షా గదిలోకి ప్రవేశించడానికి అనుమతించబడదని నోటిఫికేషన్‌లో కమిషన్ పేర్కొంది.

– అభ్యర్థులు బాల్‌పాయింట్ పెన్‌ను ఉపయోగించి మాత్రమే OMR షీట్‌లలో సమాధానాలను గుర్తించాలి. ఎందుకంటే ఏదైనా ఇతర కలర్ పెన్ను ఉపయోగించడం అనర్హతకు దారి తీస్తుంది.

– పరీక్ష హాలులో ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరం లేదా మొబైల్ ఫోన్, స్మార్ట్ వాచ్ వంటి గాడ్జెట్‌లను అనుమతించరు.

– అభ్యర్థులు వాటర్ బాటిళ్లు, ఫేస్ మాస్క్‌లు, హ్యాండ్ శానిటైజర్ బాటిళ్లను పరీక్ష హాల్‌లోకి తీసుకెళ్లేందుకు అనుమతిస్తారు.

– పరీక్ష ప్రారంభమైన తర్వాత అభ్యర్థులను లోపలికి అనుమతించరు. కాబట్టి పరీక్ష ప్రారంభమయ్యే 30 నిమిషాల ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని మేము అభ్యర్థులకు సలహా ఇస్తున్నాము.