Most Popular CMs : దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రులు ఎవరు ? అనే దానిపై ప్రముఖ జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర ఫలితాలు వచ్చాయి. నంబర్ 2 ప్లేస్లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిలిచారు. ఆయనకు 51.3 శాతం పాపులారిటీ రేటింగ్ లభించింది. నంబర్ 1 ప్లేసులో నిలిచిన సీఎం(Most Popular CMs) ఎవరు ? ఇప్పుడు తెలుసుకుందాం..
We’re now on WhatsApp. Click to Join
దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన సీఎంల జాబితాలో నంబర్ 5 ప్లేస్లో త్రిపుర ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహా నిలిచారు. సర్వేలో పాల్గొన్న ప్రజలు.. మాణిక్ సాహా సరళత, అంకితభావం, నిజాయితీలను మెచ్చుకున్నారు. తమ సుఖదుఃఖాల్లో పాలుపంచుకునే కరుణామయ నాయకుడు సాహా అని ప్రజలు కొనియాడారు. వాస్తవానికి మాణిక్ సాహా ఒక డెంటల్ సర్జన్. 2023 మార్చిలో జరిగిన ఎన్నికల్లో త్రిపురలో బీజేపీ గెలవడంలో ఆయన పాత్రే కీలకం. వరుసగా రెండోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. మాణిక్ సాహా 2016లో కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరారు. ఆయన 2020లో రాష్ట్ర బీజేపీ చీఫ్గా నియమితులయ్యారు. 2022 మార్చిలో రాజ్యసభకు ఎన్నికయ్యారు.
ఈ సర్వే రిపోర్ట్ ప్రకారం.. బీజేపీయేతర పార్టీల సీఎంల(Most Popular CMs) పాపులారిటీ గ్రాఫ్ క్రమంగా పడిపోతోంది. నంబర్ 1 ప్లేసులో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నిలవగా, ఆయన తర్వాతి ఆరు స్థానాలలో బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలే ఉన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు అందరికీ అప్రూవల్ రేటింగ్ 40 శాతానికిపైనే ఉంది. మరోవైపు బీజేపీయేతర రాష్ట్రాల సీఎంల గ్రాఫ్ క్రమంగా పడిపోతోంది. ఉదాహరణకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఈ ఏడాది పాపులారిటీ రేటింగ్ 36.5 శాతానికి తగ్గిపోయింది. 2023 ఆగస్టు నాటికి ఇది 57.7 శాతంగా ఉండేది.