UP Crime:యూపీలో అమానుషం.. అక్కాచెల్లెళ్ల రేప్ , మ‌ర్డ‌ర్‌.. ఆరుగురి అరెస్టు

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ల‌ఖింపూర్ ఖేరీలో ఇద్ద‌రు ద‌ళిత అక్కాచెల్లెళ్ల‌ను రేప్ చేసి, మ‌ర్డ‌ర్ చేసిన ఘటన కలకలం రేపుతోంది.

  • Written By:
  • Updated On - September 18, 2022 / 09:42 AM IST

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ల‌ఖింపూర్ ఖేరీలో ఇద్ద‌రు ద‌ళిత అక్కాచెల్లెళ్ల‌ను రేప్ చేసి, మ‌ర్డ‌ర్ చేసిన ఘటన కలకలం రేపుతోంది. 17 ఏళ్లు, 15 ఏళ్ల వయసున్న ఆ ఇద్దరు అమ్మాయిల్ని పాశవికంగా రేప్ చేసి చంపారు. అనంతరం దాన్ని ఆత్మహత్య గా చిత్రీకరించేందుకు ఓ చెట్టుకు వేలాడ‌దీశారు. ఈ కేసులో యూపీ పోలీసులు సుహేల్‌, జునైద్‌, హ‌ఫీజుల్ రెహ్మాన్‌, క‌రీముద్దిన్‌, ఆరిఫ్‌, చోటూ అనే ఆరుగురు యువ‌కుల్ని అరెస్టు చేశారు. వీరిలో న‌లుగురు వ్య‌క్తులే ఆ ద‌ళిత అమ్మాయిల్ని ఉరివేసి చంపారని తెలుస్తోంది.

చోటూ ద్వారా..

ఆ ఇద్ద‌రు అమ్మాయిల‌కు చోటూ ప‌రిచ‌య‌స్తుడు. అమ్మాయిలను మిగితా ఐదుగురు యువకులకు పరిచయం చేసింది చోటూయే అని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. సుహేల్, జునైద్‌లు కలిసి ఇద్ద‌రు అమ్మాయిల్ని చెరుకు తోట‌లోకి తీసుకువెళ్లిన‌ట్లు జిల్లా పోలీసు అధికారి సంజీవ్ సుమన్ వెల్లడించారు.

పెళ్లి చేసుకోవాల‌ని ఒత్తిడి చేయ‌డంతో..

పెళ్లి చేసుకోవాల‌ని ఆ యువ‌తులు ఒత్తిడి చేయ‌డంతో.. వాళ్ల దుప‌ట్టాతోనే ఆ ఇద్ద‌రికి ఉరి వేసిన‌ట్లు దర్యాప్తులో గుర్తించారు. ఇద్దరు అమ్మాయిల్ని చంపే క్రమంలో సుహేల్, జునైద్‌లకు
క‌రీముద్దీన్‌, ఆరిఫ్‌లు స‌హ‌క‌రించిన‌ట్లు పోలీసులు చెప్పారు. రేప్‌ చేసి , మ‌ర్డ‌ర్ చేశాక ఆ యువ‌కులు.. ఇద్ద‌రు అక్కాచెల్లెళ్ల మృత‌దేహాల‌ను చెట్టుకు వేలాడ‌దీశార‌ని, ఆ ఇద్ద‌రిదీ ఆత్మ‌హ‌త్య అనుకునేలా చెట్టుకు ఉరివేసిన‌ట్లు పోలీసులు వివరించారు. అయితే అక్కాచెల్లెళ్ల‌ను కిడ్నాప్ చేయ‌లేద‌ని, ఇష్ట‌పూర్వ‌కంగానే ఆ యువ‌కుల బైక్‌ల‌పై వాళ్లిద్దరూ వెళ్లిన‌ట్లు స్పష్టం చేశారు.

సుహేల్‌, జునైద్‌ల‌కు స్నేహితులే..

సుహేల్‌, జునైద్‌ల‌కు ఆ ఇద్ద‌రు సిస్ట‌ర్స్ స్నేహితుల‌ని తెలుస్తోంది. మొత్తం ఆరుగురు నిందితులకుగానూ అయిదుగుర్ని బుధ‌వార‌మే అరెస్టు చేశారు. ఒక‌ర్ని ఇవాళ ఉద‌యం ప‌ట్టుకున్నారు. త‌న కూతుళ్లు ఇద్ద‌రూ ఇంటి నుంచి వెళ్లిన.. మూడు గంట‌ల త‌ర్వాత శ‌వ‌మై తేలిన‌ట్లు త‌ల్లి ఆరోపించింది. తన కూతుళ్ళను
ముగ్గురు యువ‌కులు బ‌ల‌వంతంగా బైక్‌పై తీసుకువెళ్లిన‌ట్లు ఆమె తెలిపింది.

ఇదే లఖీంపూర్ ఖేరీలో రైతులపైకి కారు పోనిచ్చి కేంద్రమంత్రి కుమారుడు చేసిన అరాచకం మర్చిపోకముందే .. అదే ప్రాంతంలో ఇద్దరు దళిత అక్కాచెల్లెళ్లను ఉరేసిన ఘటన కలకలం రేపుతోంది.