Maharajah Duleep Singh : సిక్కు సామ్రాజ్యం చివరి పాలకుడు మహారాజా దులీప్ సింగ్. ఆయన రెండో కుమారుడి పేరు ప్రిన్స్ ఫ్రెడరిక్ దులీప్ సింగ్. ప్రిన్స్ ఫ్రెడరిక్ దులీప్ సింగ్ 1924లో తన తండ్రికి సంబంధించిన గుర్తులతో నార్ఫోక్ కౌంటీ పరిధిలోని థెట్ఫోర్డ్లో మ్యూజియంను ఏర్పాటుచేశారు. తాజాగా ఈ మ్యూజియం నిర్వహణకు నేషనల్ లాటరీ హెరిటేజ్ ఫండ్ దాదాపు రూ.2 కోట్లను మంజూరు చేసింది. ఈ మ్యూజియం ప్రస్తుతం 100వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా విరాళాన్ని ఇచ్చామని నేషనల్ లాటరీ హెరిటేజ్ ఫండ్ వెల్లడించింది. మహారాజా దులీప్ సింగ్ కుటుంబం ఆనాడు వాడిన వస్తువులను ప్రదర్శించేందుకు, ఆ ఫ్యామిలీ చరిత్రను అద్దంపట్టే అవశేషాలను ఒకచోటకు చేర్చడానికి ఈ నిధులను వాడుతారు. దులీప్ సింగ్(Maharajah Duleep Singh) కుటుంబం చారిత్రక విశేషాలకు నెలవైన ఈ మ్యూజియంలో ఆంగ్లో-పంజాబ్ హిస్టరీ గురించి పూర్తి వివరణ ఉంటుంది. గతంలో వేల్స్ యువరాజుగా వ్యవహరించిన కింగ్ ఎడ్వర్డ్ VII .. దులీప్ సింగ్ వాకింగ్ స్టిక్ సహా పలు కుటుంబ వస్తువులను ఈ మ్యూజియానికి అందించడం విశేషం.
We’re now on WhatsApp. Click to Join.
మహారాజా దులీప్ సింగ్ ఎవరు ?