ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద ఉచితంగా అందిస్తోన్న గ్యాస్ కనెక్షన్ల భాగోతం చూస్తే..పేదలపై ప్రభుత్వాలకు ఉండే ఉదాసీనత బయటపడుతోంది. ఎన్నికల సమయంలో మాత్రం రాకెట్ మాదిరిగా ఉచిత కనెక్షన్ల సంఖ్యను పెంచడం, ఆ తరువాత మొఖం చాటేయడం పరిపాటి అయింది. తెలంగాణలో 2016-17 ఆర్థిక సంవత్సరంలో కేవలం 40 కనెక్షన్లు మాత్రం ఇచ్చారు. ఆ తరువాత ఏడాది( 2017-18) లో ఒక్క కనెక్షన్ కూడా ఇవ్వలేదు. ఆ ఏడాది కనెక్షన్ల సంఖ్య సున్నాకు పడిపోయింది. అదే 2018-19 ఆర్థిక సంవత్సరంలో 9,16,299 కనెక్షన్లను ప్రభుత్వం మంజూరు చేసింది. కారణం, ఆ ఏడాది రెండవ శాసనసభ ఎన్నికల ఉండడంతో పేద గ్రామీణ మహిళల మీద ప్రభుత్వానికి శ్రద్ధ పుట్టుకొచ్చింది.తెలంగాణ రాష్ట్రంలో మాదిరిగానే మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు వచ్చిన సమయంలో మాత్రమే ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింద గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నారు. ఆ తరువాత ఆ స్కీంను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నామమాత్రం చేస్తున్నాయని డేటా చెబుతోంది.
ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద గ్రామీణ గృహాలకు LPG కనెక్షన్లను అందుబాటులోకి తీసుకురావాలనే 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు శ్రీకారం చుట్టారు. ఆ పథకం కింద లబ్ధిదారుల వివరాలను ఆర్డీఐ ద్వారా సేకరించగా, పెట్రోలియం మరియు సహజవాయువు మంత్రిత్వ శాఖ వివరాలను అందించింది. వాటి ప్రకారం 2016-17లో దేశ వ్యాప్తంగా 1,93,05,327 ఉచిత కనెక్షన్లు పంపిణీ చేయగా, 2017-18లో 1,58,69,857కి పడిపోయింది. కానీ 2018-19లో 100 శాతం పెరుగుదలతో 3, 57,64,417 కొత్త కనెక్షన్లను ఇచ్చారు. మరుసటి ఏడాది ఆ సంఖ్య కేవలం 90,60,124కి పడిపోయింది.
2016లో, నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది ఈ పథకం కింద 2020 నాటికి 8 కోట్ల LPG కనెక్షన్లను నిరాశ్రయులైన గృహాలకు విడుదల చేయడం లక్ష్యం. ఇది మార్చి 2020 గడువు కంటే ఏడు నెలల ముందుగా, ఆగస్టు 2019లో సేకరించడం జరిగింది. 2016-17లో, ఉజ్వల ప్రారంభించబడినప్పుడు, ఢిల్లీలో పంపిణీ చేయబడిన మొత్తం LPG సిలిండర్లు కేవలం 463 మాత్రమే. ఇది 2017-18లో 18కి పడిపోయింది. అయితే, 2018-19లో అది 73,251కి చేరి, మరుసటి ఏడాది మళ్లీ 3,110కి పడిపోయింది. అదేవిధంగా కేరళలో, 2016-17లో మొత్తం కనెక్షన్ 10,872 కాగా, 2017-18లో 27,630కి చేరుకుంది. కానీ మరుసటి ఏడాది ఈ సంఖ్య 1,70988కి పెరిగింది.మార్చి 2017లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఉత్తరప్రదేశ్లో, 2016-17లో 54,64,190 గ్యాస్ కనెక్షన్లతో గరిష్ట పంపిణీ జరిగింది. మరుసటి సంవత్సరం ఆ సంఖ్య కేవలం 10 లక్షలకు పడిపోయింది. సార్వత్రిక ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు (2018-19) ఆ రాష్ట్రం 63,17,525 గ్యాస్ కనెక్షన్లను పొందింది. పశ్చిమ బెంగాల్లో 2016-17 ఆర్థిక సంవత్సరంలో 23,80,518. ఆర్థిక సంవత్సరం 2017-18 మరియు 2018-19లో 29,46,062గా కనెక్క్షన్లను మంజూరు చేసినట్టు ఆర్టీఐ నివేదిక చెబుతోంది.
బీజేపీ పాలిత రాష్ట్రం కర్ణాటకలో 2016-17 ఆర్థిక సంవత్సరానికి ఉచిత గ్యాస్ పంపిణీ కేవలం 6024. కానీ 2017-18లో 8,95,333కి మరియు 2018-19లో 18,54,061కి పెరిగింది. రాష్ట్రంలో 2018లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి, ఆ తర్వాత మే 2019లో సాధారణ ఎన్నికలు జరిగాయి. అస్సాంలో కూడా 2016-17 ఆర్థిక సంవత్సరంలో కేవలం 2 మాత్రమే ఉన్న కనెక్షన్ సంఖ్యలు 2017-18లో పది లక్షలకు మరియు 101-19లో పది లక్షలకు పెరిగాయి. ఇలా ఎన్నికల టైంలో అనూహ్యంగా పేద గ్రామీణ మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లను ఇస్తూ ఓట్లకు ప్రభుత్వాలు గాలం వేస్తున్నాయని ఆర్టీఐ ఇచ్చిన ఉజ్వల్ యోజన నివేదిక స్పష్టం చేస్తోంది.