Two minor sisters: దారుణం.. అక్కాచెల్లెళ్లను కిడ్నాప్ చేసి అత్యాచారం..!

మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో ఇద్దరు మైనర్ సోదరీమణులను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు.

  • Written By:
  • Publish Date - November 19, 2022 / 10:02 PM IST

మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో ఇద్దరు మైనర్ సోదరీమణులను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు. మధ్యప్రదేశ్‌ గుణ జిల్లాలో ఇద్దరు అక్కాచెల్లెళ్లపై రోజూ పాఠశాలకు తీసుకెళ్లే వ్యక్తి కన్నేశాడు. నవంబర్ 10న వారు బయటకు వచ్చినప్పుడు కొందరి సాయంతో వారిని కిడ్నాప్ చేశాడు. మత్తు మందు ఇచ్చి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. బాధితురాళ్ల కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

ఈ కేసులో మైనర్‌తో సహా ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. మరో ఇద్దరు నిందితుల కోసం అన్వేషణ కొనసాగుతోంది. బాధితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా నిందితులపై ఐపీసీ సెక్షన్ 376 (అత్యాచారం)తో పాటు ఇతర సెక్షన్ల కింద, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీస్ సూపరింటెండెంట్ పంకజ్ శ్రీవాస్తవ శనివారం తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత సోదరీమణుల వయస్సు 13, 17 ఏళ్లు. ఈ ఘటనలో మైనర్‌ను అదుపులోకి తీసుకున్నామని, నిందితుడిని అరెస్టు చేశామని, మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం అన్వేషణ కొనసాగుతోందని తెలిపారు. నవంబర్ 10-11 మధ్య రాత్రి మలవిసర్జన కోసం బయటకు వెళ్లిన ఇద్దరు సోదరీమణులను రుతియాయ్ ప్రాంతం నుండి కిడ్నాప్ చేశారని, నిందితులు గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. అక్కాచెల్లెళ్లిద్దరిపై అక్కడ అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు వివరించారు. అనంతరం ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని కుటుంబ సభ్యులను నిందితులు బెదిరించారని పోలీసులు పేర్కొన్నారు.