Train On Platform : ఆ ట్రైన్ కు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. దీంతో దానిపై డ్రైవర్ కంట్రోల్ కోల్పోయాడు. ఆ ట్రైన్ ఏకంగా ప్లాట్ఫాంపైకి దూసుకొచ్చింది. దీంతో అక్కడ ప్లాట్ ఫామ్ పై ఉన్న ప్రయాణికులు హడలెత్తారు. ఏం జరుగుతోందో ఎవరికీ అర్థం కాలేదు. లక్కీగా ట్రైన్ కు బ్రేకులు పడటంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని మథుర రైల్వేస్టేషన్లో జరిగింది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని రైల్వే అధికారులు వెల్లడించారు. ఒక ప్యాసింజర్ రైలు శుకర్ బస్తీ స్టేషన్ నుంచి మంగళవారం రాత్రి 10.49 గంటలకు మథుర రైల్వే స్టేషన్ కు చేరుకుంది. ప్రయాణికులంతా ఆ రైలు నుంచి దిగి వెళ్లిపోయారు. అనంతరం బ్రేకులు ఫెయిలై రెండో నంబర్ ప్లాట్ఫాంపైకి ఒక్కసారిగా దూసుకెళ్లింది. ప్లాట్ఫాంపై ఉన్న కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన వల్ల పలు రైళ్ల రాకపోకలకు ఆలస్యమయ్యాయని అధికారులు (Train On Platform) చెప్పారు.
Train On Platform : ప్లాట్ ఫామ్ పైకి దూసుకొచ్చిన రైలు.. ఏం జరిగిందంటే ?

Train On Platform