పహల్గామ్ ఉగ్రదాడికి పాకిస్థాన్పై భారత్ ప్రతీకారం తీర్చుకుంది.. పాక్, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలపై మంగళవారం అర్ధరాత్రి మెరుపుదాడి చేసింది. దాయాదిపై భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో చేపట్టిన ఈ సైనిక చర్యలో ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు పాల్గొన్నాయి. మంగళవారం అర్ధరాత్రి 1:44 గంటలకు ఈ దాడి జరిగింది ఈ దాడుల్లో పాక్ ఆక్రమిత కశ్మీర్తో పాటు పాకిస్థాన్లోని ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేశారు.
1. అంతర్జాతీయ సరిహద్దుకు 100 కి.మీ దూరంలో ఉన్న బహవల్ పూర్లో ఉన్న జై-షే మహమ్మద్ ప్రధాన కార్యాలయం
2. మురిడ్కే, సాంబా ఎదురుగా సరిహద్దుకు 30 కి.మీ దూరంలో ఉన్న లష్కరే క్యాంప్
3. సరిహద్దు నియంత్రణ రేఖ పూంఛ్- రాజౌరీకి 35 కి.మీ దూరంలో ఉన్న గుల్పూర్
India – Pakistan War : పాక్ స్థావరాలపై భారత్ మెరుపు దాడులు – 30 మంది ఉగ్రవాదులు మృతి
4. పాక్ ఆక్రమిత జమ్మూకశ్మీర్లోని తంగ్ధర్ సెక్టార్ లోపల 30 కి.మీ పరిధిలో ఉన్న సవాయ్ లష్కరే క్యాంప్
5. జే-షే-మహమ్మద్ లాంచ్ ప్యాడ్ బిలాల్ క్యాంప్
6. రాజౌరీకి ఎదురుగా నియంత్రణ రేఖకు 15 కి.మీ.ల దూరంలో ఉన్న జే-షే-మహమ్మద్ లాంచ్ ప్యాడ్
7. రాజౌరీకి ఎదురుగా నియంత్రణ రేఖకు 10.కి.మీ పరిధిలో ఉన్న బర్నాలా క్యాంప్
8. సాంబా-కతువా ఎదురుగా అంతర్జాతీయ సరిహద్దుకు 8కి.మీ దూరంలో ఉన్న జై-షే-మహమ్మద్ సర్జల్ క్యాంప్
CBN Gift : బాలకృష్ణ కు చంద్రబాబు మరో గిఫ్ట్
9. అంతర్జాతీయ సరిహద్దు కు 15 కిమీ దూరంలో సియాల్కోట్ సమీపంలో ఉన్న హిజ్బుల్ ముజాహిద్దీన్ శిక్షణా శిబిరం మెహమూనా క్యాంప్ వంటి కేంద్రాలను భారత సైన్యం లక్ష్యంగా చేసుకుంది. ఈ దాడులతో ఉగ్రవాదుల నెట్వర్క్కు గట్టి దెబ్బ తగలగా, భారతదేశపు రక్షణ సామర్థ్యాన్ని ప్రపంచం ముందు చాటిచెప్పే చర్యగా ఈ ఆపరేషన్ నిలిచింది.
శభాష్ ఇండియన్ ఆర్మీ!
పహల్గామ్ దాడికి భారత్ ప్రతీకారం
ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించిన ఇండియన్ ఆర్మీ
POK లో 9 పాక్ ఉగ్ర శిబిరాలపై భారత దళాల మెరుపు దాడులు
మొత్తం 9 పాక్ ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసిన భారత ఆర్మీ#OperationSindooor #PahalgamAttack #IndianArmedForces #Pakistan pic.twitter.com/ElaS3StphO
— Tharun Reddy (@Tarunkethireddy) May 7, 2025