Suicide : పుణెలో రేప్‌కేసులో నిందితుడు ఆత్మ‌హ‌త్య‌

మహారాష్ట్రలో 14 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణలపై ఒక అత్యాచార నిందితుడు, మరొకరిపై

  • Written By:
  • Publish Date - May 1, 2023 / 08:24 AM IST

మహారాష్ట్రలో 14 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణలపై ఒక అత్యాచార నిందితుడు, మరొకరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో నిందితుడు ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్పిడిన‌ట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన పూణె జిల్లాలోని ఇందాపూర్ తాలూకాలో చోటుచేసుకుంది. ఇద్దరు నిందితులను అర్జున్ కుమార్, రమేష్ రఘునాథ్ మోరేలుగా గుర్తించారు. పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైన అనంతరం నిందితుల్లో ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. బారామతి డీఎస్పీ గణేష్ ఇంగాలే తెలిపిన వివరాల ప్రకారం.. ఫర్నేస్‌లో పనిచేస్తున్న 14 ఏళ్ల మైనర్ బాలికపై అర్జున్ కుమార్, రమేష్ రఘునాథ్ అత్యాచారం చేశారు. ఐదు నెలల తర్వాత కడుపు నొప్పి గురించి బాలిక ఫిర్యాదు చేయగా, ఈ ఘ‌ట‌న బ‌య‌ట‌ప‌డింది. దీంతో ద‌ర్యాప్తు చేసిన పోలీసులు నిందితులిద్దరిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుల కోసం పోలీసులు వెతుకుతున్న స‌మ‌యంలో నిందితుల్లో ఒక‌రు బారామతి-భిగ్వాన్ రోడ్డు సమీపంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి విచారణ జరుపుతున్నారు.