Arun Yogiraj : అయోధ్య రామమందిరం గర్భగుడిలో ప్రతిష్ఠించిన భగవాన్ శ్రీరాముడి ప్రతిమను మైసూరుకు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కారు. సోమవారం అయోధ్యలో జరుగుతున్న రాముడి ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఇప్పుడు భూమిపైన అత్యంత అదృష్టవంతుడైన వ్యక్తిని నేేనే’’ అని శిల్పి అరుణ్ యోగిరాజ్(Arun Yogiraj) చెప్పారు. ‘‘నా పూర్వీకులు, కుటుంబ సభ్యులు, భగవంతుడు రామ్ లల్లా ఆశీర్వాదం నాకు ఎల్లప్పుడూ ఉంది. కొన్నిసార్లు నేను కలల ప్రపంచంలో ఉన్నానేమో అనిపిస్తోంది’’ అని యోగిరాజ్ తెలిపారు. 51 అంగుళాల ఎత్తైన బాలరాముడి విగ్రహాన్ని ఎంతో భక్తిభావంతో తాను తయారు చేశానని చెప్పారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక అయోధ్యలో ఇన్నాళ్లూ పాత మందిరంలో ఉన్న పాత బాల రాముడి విగ్రహాన్ని ఏం చేస్తారని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్గా మారింది. దీనిపై తీర్థక్షేత్ర ట్రస్ట్ స్పందించింది. సోమవారం గర్భగుడిలో కొత్తగా ప్రతిష్టించనున్న బాలరాముడి విగ్రహానికి ఎదురుగా పాత విగ్రహాన్ని ప్రతిష్టించేలా ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. పాత విగ్రహం దాదాపు 6 అంగుళాల ఎత్తు ఉందని.. అది 30 అడుగుల దూరం ఉన్నవారికి కూడా కనిపించదు అని అందుకే కొత్త విగ్రహం అవసరమైందని తెలిపారు. కాగా, దాదాపు 1800 కోట్లతో రామమందిరాన్ని నిర్మించారు.