తెలంగాణ(Telangana)లో రాహుల్ గాంధీ (Rahul Gandhi) తన పర్యటనను ఫిబ్రవరి మొదటి వారంలో లేదా రెండో వారంలో నిర్వహించనున్నట్లు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (PCC Chief Mahesh Kumar Goud) తెలిపారు. ఈ సందర్భంగా సూర్యాపేట లేదా ఖమ్మంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇందులో భాగంగా, మహేశ్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పదవుల భర్తీ, కార్పొరేషన్ల చైర్మన్ల నియామకంపై చర్చలు జరిపినట్లు, ఈ నెలాఖరు వరకు ఈ భర్తీలు పూర్తవుతాయని, అలాగే తెలంగాణలో జీహెచ్ఎంసీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు సాధించేందుకు పార్టీ కార్యవర్గం మరింత కృషి చేయాలని సూచించారు.
Bhatti Vikramarka : హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ తో భట్టి విక్రమార్క భేటీ
ఈ సమావేశంలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ పర్యటనపై కూడా చర్చ జరిగింది. ఆయన మంత్రులకు, కాంగ్రెస్ నాయకులకు జిల్లా స్థాయిలో పర్యటించి కార్యకర్తలకు సమీపంగా ఉండాలని సూచించారు. ఈ విధంగా పార్టీ నిర్మాణాన్ని బలపరచడం, రాబోయే అన్ని ఎన్నికల్లో పార్టీ విజయాన్ని సాధించడానికి పకడ్బందీగా పని చేయాలని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయిలో సానుకూలంగా పనిచేయాలని, పార్టీ పదవులని బలోపేతం చేసుకోవాలని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన గురించి జరిగిన చర్చలు పార్టీకి మరింత ఊతం ఇవ్వాలని భావిస్తున్నారు. రాహుల్ గాంధీ సూర్యాపేటలో లేదా ఖమ్మంలో నిర్వహించే బహిరంగ సభలో పెద్ద సంఖ్యలో ప్రజల పాల్గొని, కాంగ్రెస్ పార్టీకి ప్రాధాన్యత ఇవ్వాలని పీసీసీ భావిస్తోంది.