Site icon HashtagU Telugu

Rahul Gandhi: రాజస్థాన్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన రాహుల్

Rahul Gandhi Tweet

Rahul Gandhi

Rahul Gandhi: బీజేపీ.. మహాకూటమి ఇండియా. భారతదేశం మధ్య వివాదం సృష్టించాలని చూస్తున్నదని, అందుకే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలకు పిలిచారని ఆరోపించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఇండియా పేరు మార్పు కోసమని పిలిచి మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ప్రత్యేక సమావేశానికి పిలిచినప్పుడు, మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి ప్రస్తావించలేదని అన్నారు. అంతకుముందు రాజస్థాన్‌లో జరిగిన కార్యకర్తల సదస్సులో పాల్గొని రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. జైపూర్ లో జరిగిన ఉద్యోగుల సదస్సులో.. కేంద్రంలో ప్రభుత్వం అధికారంలోకి వస్తే తక్షణమే మహిళా రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వ హయాంలో 2010లో మహిళా రిజర్వేషన్ బిల్లును రాజ్యసభ ఆమోదించారు, అయితే అది లోక్‌సభలో వర్కౌట్ అవ్వలేదు. మహిళా రిజర్వేషన్‌కు ప్రతిపక్షాలన్నీ మద్దతిచ్చాయని, తాము కూడా మహిళా రిజర్వేషన్లను నేటి నుంచే అమలు చేయాలని కోరుతున్నామని, అయితే బీజేపీ మాత్రం పదేళ్ల తర్వాత అమలు చేయాలని చూస్తున్నదని అన్నారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లులో ఓబీసీలకు రిజర్వేషన్లు ఎందుకు కల్పించడం లేదని రాహుల్ ప్రశ్నించారు. ప్రధాని తన 90 మంది అధికారులతో కలిసి దేశాన్ని నిర్వహిస్తున్నారని అయితే వారిలో కేవలం ఐదు శాతం మాత్రమే నిర్ణయించే 90 మంది అధికారులలో ముగ్గురు OBCలు మాత్రమే ఉన్నారని రాహుల్ అన్నాడు.

రాజస్థాన్‌లో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2008 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ 100 సీట్లు సాధించింది, సంపూర్ణ మెజారిటీ సాధించడానికి ఒక సీటు తక్కువ అయిన నేపథ్యంలో మాయావతికి బీఎస్పీతో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

Also Read: CBN : ఛ‌లో రాజ‌మండ్రికి సిద్ధ‌మైన ఐటీ ఉద్యోగులు..ఆంధ్ర తెలంగాణ స‌రిహ‌ద్ధ వ‌ద్ద ఉద్రిక్త ప‌రిస్థితులు

Exit mobile version