2019 ఫిబ్రవరి 14న జమ్మూకశ్మీర్లోని పుల్వామా (Pulwama)లో ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో 40 మంది జవాన్లు వీరమరణం పొందారు. పుల్వామా దాడిలో ప్రాణాలు విడిచిన వీర జవానులకు ప్రధాని మోదీ (Prime Minister Narendra Modi) నివాళులు అర్పించారు. ‘‘పుల్వామాలో ఇదే రోజున జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు విడిచిన అమరవీరులను స్మరించుకుంటున్నాము. వారి త్యాగాన్ని, దేశానికి చేసిన సేవలను ఎన్నటికీ మరువలేము. వారి ధైర్యమే బలమైన, అభివృద్ధి చెందిన భారత్ను నిర్మించే విధంగా మమ్మల్ని ప్రేరేపిస్తోంది’’ అని మోదీ ట్వీట్ చేశారు.
2019లో ఇదే రోజున (ఫిబ్రవరి 14) పుల్వామా జిల్లాలోని లెత్పోరా వద్ద జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై సీఆర్పీఎఫ్ జవాన్ల కాన్వాయ్పై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి జరిపారు. ఈ ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరవీరులయ్యారు.
Remembering our valorous heroes who we lost on this day in Pulwama. We will never forget their supreme sacrifice. Their courage motivates us to build a strong and developed India.
— Narendra Modi (@narendramodi) February 14, 2023
పుల్వామాలో ఇంటెలిజెన్స్ వైఫల్యం కారణంగా అమరులైన 40 మంది సిఆర్పిఎఫ్ అమరవీరులకు ఈరోజు నివాళులర్పిస్తున్నామని, అమరవీరుల కుటుంబాలందరికీ పునరావాసం కల్పించాలని ఆశిస్తున్నాను అని కాంగ్రెస్ నేత దిగ్విజయ సింగ్ ట్వీట్ చేశారు.పుల్వామా దాడిలో అమరులైన జవాన్లకు కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ ఖాతా కూడా నివాళులర్పించింది. పుల్వామా ఉగ్రదాడిలో దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు వందలాది నివాళులర్పిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. ఈ రోజు మనం భారతమాత వీర పుత్రులకు మా హృదయపూర్వక నివాళులర్పిస్తున్నామని ట్వీట్ చేసింది.
పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన ఉగ్రవాదులకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా నివాళులర్పించారు. 2019 సంవత్సరంలో ఈ రోజున పుల్వామాలో జరిగిన భయంకరమైన ఉగ్రదాడిలో ప్రాణాలర్పించిన వీర జవాన్లకు నేను నివాళులర్పిస్తున్నాను. వారి త్యాగాన్ని దేశం ఎప్పటికీ మరచిపోదు. వారి పరాక్రమం, అలుపెరగని ధైర్యసాహసాలు ఉగ్రవాదంపై పోరులో ఎప్పుడూ స్ఫూర్తిగా నిలుస్తాయని అమిత్ షా ట్వీట్లో పేర్కొన్నారు.
Also Read: Telangana Secretariat: తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభం ముహూర్తం ఖరారు..?
బీజేపీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా అమరవీరులకు నివాళులర్పించారు. బీజేపీ నేత కపిల్ మిశ్రా మాట్లాడుతూ.. పుల్వామా జిహాదీ దాడిలో అమరులైన మన వీర జవాన్లకు వందల వందనాలు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కూడా భావోద్వేగంతో నివాళులర్పించారు. పుల్వామా ఉగ్రదాడిలో వీరమరణం పొందిన వీర జవాన్లకు ఆత్మీయ నివాళులు అర్పిస్తున్నట్లు ట్వీట్ చేశారు. వారి అత్యున్నత త్యాగాన్ని భారతదేశం ఎప్పుడూ గుర్తుంచుకుంటుందని ఆయన ట్వీట్ చేశారు.