Site icon HashtagU Telugu

Surat Diamond Bourse : సూరత్ డైమండ్ బోర్స్‌ను ప్రారంభించిన ప్రధాని.. టాప్-10 విశేషాలు

Surat Diamond Bourse

Surat Diamond Bourse

Surat Diamond Bourse : అంతర్జాతీయ వజ్రాల వ్యాపారానికి కేంద్రం గుజరాత్‌లోని సూరత్. సూరత్‌ ​సమీపంలోని ఖజోడ్​ గ్రామంలో సూరత్​ డైమండ్​ బోర్స్‌ను రూ.3,400 కోట్ల వ్యయంతో దాదాపు 35.54 ఎకరాల్లో 67 లక్షల 28 వేల 604 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు.ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ సముదాయమైన సూరత్​ డైమండ్ బోర్స్​‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం ప్రారంభించారు. అనంతరం సూరత్ విమానాశ్రయం కొత్త టెర్మినల్‌ను కూడా ప్రధాని ప్రారంభించారు.  అంతకు ముందు ప్రధాని మోడీ ట్వీట్ చేస్తూ.. ‘‘సూరత్ డైమండ్ బోర్స్ అనేది సూరత్ వజ్రాల పరిశ్రమ చైతన్యాన్ని, అభివృద్ధిని ప్రదర్శిస్తుంది. ఇది వాణిజ్యం, ఆవిష్కరణలు, సహకారానికి కేంద్రంగా ఉపయోగపడుతుంది. ఇది భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఉపాధి అవకాశాలను పెంచుతుంది’’ అని పేర్కొన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

Also Read: America – Ayodhya : అమెరికా రాజధానిలో అయోధ్య రామయ్య నామస్మరణతో ర్యాలీ