President Murmu : తమిళనాడు గవర్నర్ వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వం కేసులో ఏప్రిల్ 8న సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పరిశీలన కోసం రాష్ట్ర ప్రభుత్వాలు పంపే బిల్లులపై గవర్నర్లు, రాష్ట్రపతి స్పందించే విషయంలో నిర్దిష్ట గడువు అనేది ఉండాలని ఆ తీర్పులో దేశ సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈనేపథ్యంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 143(1) కింద విశేషాధికారాలను ఉపయోగించి సుప్రీంకోర్టు పరిశీలన కోసం భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 14 రాజ్యాంగ సంబంధిత ప్రశ్నలను సంధించారు. ఈ ప్రశ్నలన్నీ దేశంలోని రాష్ట్రాల చట్టాలపై గవర్నర్లు, రాష్ట్రపతికి ఉండే అధికారాల పరిధికి సంబంధించినవే. వీటిపై అభిప్రాయాన్ని తెలియజేయాల్సిందిగా సుప్రీంకోర్టును రాష్ట్రపతి కోరారు.
President Murmu : రాష్ట్రపతి, గవర్నర్లకు ‘సుప్రీం’ డెడ్లైన్ పెట్టొచ్చా.. ? ముర్ము 14 ప్రశ్నలు
