Lok Sabha Election 2024 schedule announcement ECI : సార్వత్రిక ఎన్నికలకు మరికొద్ది గంటల్లో నగారా మోగనుంది. కేంద్ర ఎన్నికల సంఘం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో మీడియా సమావేశం నిర్వహించి షెడ్యూల్ను ప్రకటించనుంది. ప్రస్తుత 17వ లోక్సభకు జూన్ 16వ తేదీతో గడువు ముగియనుంది. దీంతో పాటు..
ఒకేసారి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు..
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు మే 13న జరుగుతాయని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఎన్నికలకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ ఏప్రిల్ 18న వెలువడుతుంది. ఏప్రిల్ 25 వరకూ నామినేషన్లు దాఖలు చేసుకునేందుకు అనుమతిస్తారు. ఏప్రిల్ 26న నామినేషన్ల స్క్రూటినీ జరుగుతుంది. ఏప్రిల్ 29న నామినేషన్ల ఉపసంహరణకు గడువిస్తారు. మే 13న ఎన్నికలు జరుగుతాయి. జూన్ 4న కౌంటింగ్ ఉంటుంది. జూన్ ఆరు నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది.
ఏపీ ఎన్నికల షెడ్యూల్ ఇలా..
సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగింది. లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను సీఈసీ ప్రకటించింది. మొత్తం ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్ జరగనుంది. ఆంధ్రప్రదేశ్కు మే 13వ తేదీన ఒకే విడతలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపారు.