PM Modi: మాకు మోదీనే కావాలి…సర్వేలో షాకింగ్ విషయాలు..!!!

మాకు మోదీనే కావాలి. అవును ప్రధానమంత్రిగా నరేంద్రమోదీనే కావాలి. ఇవి మేమంటున్న మాటలు కావు. నరేంద్ర మోదీ ప్రభుత్వం గురించి ప్రజలు అంటున్న మాటలు.

  • Written By:
  • Publish Date - June 1, 2022 / 10:14 PM IST

మాకు మోదీనే కావాలి. అవును ప్రధానమంత్రిగా నరేంద్రమోదీనే కావాలి. ఇవి మేమంటున్న మాటలు కావు. నరేంద్ర మోదీ ప్రభుత్వం గురించి ప్రజలు అంటున్న మాటలు. తాజాగా చేసిన సర్వేలో మళ్లీ మోదీని ప్రధానమంత్రిగా కావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి పలు సమస్యలు ఉన్నా…మోదీ సర్కారు పాలనను 67శాతం మంది ప్రజలు సమర్థిస్తున్నట్లు సర్వేలో తేలింది. మాకు మోదీనే కావాలని చెబుతున్నట్లు సర్వే స్పష్టం చేసింది. నిజానికి దేశవ్యాప్తంగా ఆకాశన్నంటుతున్న నిత్యావసరాల ధరలు…నిరుద్యోగం వంటి పరిస్థితులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. బీజేపీయేతర రాష్ట్రాలు మోదీ విధానాలపై గుర్రుగా ఉన్నాయి. మోదీ అధికారంలోని దించాలని భావిస్తున్నాయి.

ఈ తరుణంలో ప్రజలు అనూహ్యంగా ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వంపై నమ్మకంగా ఉన్నారు. అందుకే ఆయన పాలనను 67శాతం మంది ఆమోదించారు. కోవిడ్ మహమ్మారి ప్రారంభం నుంచి ఈ ప్రజామోద రేటింగ్ తారాస్థాయికి చేరింది. కోవిడ్ ప్రారంభ ఏడాది 2020లో ఈ రేటింగ్ 62శాతంగా ఉంటే…సెకండ్ వేవ్ చూసిన ఉద్ద్రుతికి అది కాస్తా 51శతానికి పడిపోయింది. ఆ తర్వాత కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియను స్పీడప్ చేయడం థర్డ్ వేవ్ సమర్థవంతంగా ఎదుర్కొవడంతో…ఇప్పుడు రేటింగ్ 67శాతానికి పెరిగిపోయింది. లోకల్ సర్కిల్స్ నిర్వహించిన ఈ సర్వేలో 67వేల మంది పాల్గొన్నారు.

ఈ షంవత్సరం మొదటి నుంచి 7శాతానికి దగ్గరగా ఉండటంపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ సర్వేలో పాల్గొన్న 47శాతం మంది ప్రభుత్వ నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేదని చెప్పారు. అయితే 37శాతం మంది మోదీ పాలన నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. గత మూడేండ్లుగా నిత్యావసరాల ధరలు జీవన వ్యయాలు తగ్గడం లేదని 73శాతం మంది వెల్లడించారు. పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు 2024లో సార్వత్రిక ఎన్నికలు ఉన్నవేళ…బీజేపీకి ఇది ప్రతికూలాంశంగా కనిపిస్తోంది. 73శాతం మంది తమ భవిష్యత్తుపై సానుకూలంగా ఉండగా…50శాతం మంది మన దేశంలో వ్యాపారం చేయడం ఈజీగా మారిందని చెప్పారు. మతసామరస్యాన్ని మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం తగిన క్రుషి చేస్తోందని 60శాతం అభిప్రాయపడగా…కాలుష్య నియంత్రణపై తగిన చర్యలు తీసుకోవడం లేదని 44శాతం మంది పెదవి విరస్తున్నారు. మొత్తానికి మోదీకి మరోసారి ప్రజలు పట్టంకట్టేట్లు కనిపిస్తుండటంతో కాంగ్రెస్ లో ఆందోళన మొదలైంది.