ఈ ఏడాది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు ప్రత్యేకంగా ఉండబోతోంది. మోదీ సెప్టెంబర్ 17 పుట్టిన రోజు జరుపుకోనున్నారు. ఆ రోజున దాదాపు 7దశాబ్దాల తర్వాత చిరుతల బృందం భారత గడ్డపై అడుగుపెట్టబోతున్నాయి. నమీబియా నుంచి 8 చిరుతలు 70 ఏళ్ల తర్వాత భారత్ కు చేరుకోనున్నాయి. వాటిని తీసుకొచ్చేందుకు భారత్ నుంచి నమీబియా కు ప్రత్యేక విమానం వెళ్లింది. కార్గో విమానంలో నమీబియా నుండి జైపూర్కు తీసుకురానున్నట్లు సమాచారం.
అదే రోజు మధ్యప్రదేశ్లోని కునో-పాల్పూర్ నేషనల్ పార్క్కు తీసుకువస్తారు . ప్రధాని మోడీ తన పుట్టినరోజున దేశానికి అందజేయనున్నారు. ల్యాండ్ ఆఫ్ టైగర్స్కు గుడ్విల్ అంబాసిడర్లను తీసుకెళ్లేందుకు బహదూర్ ల్యాండ్కి ప్రత్యేక విమానంలో రాయబారి వచ్చాడని నమీబియాలోని భారత హైకమిషన్ ట్వీట్ చేసింది.
A special bird touches down in the Land of the Brave to carry goodwill ambassadors to the Land of the Tiger.#AmritMahotsav #IndiaNamibia pic.twitter.com/vmV0ffBncO
— India In Namibia (@IndiainNamibia) September 14, 2022