Project Cheetahs : ప్రధాని మోదీ పుట్టినరోజు స్పెషల్ గిఫ్ట్… 8 ఆఫ్రికన్ చిరుతలను దేశానికి అప్పగించున్న నమీబియా…!!

ఈ ఏడాది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు ప్రత్యేకంగా ఉండబోతోంది. మోదీ సెప్టెంబర్ 17 పుట్టిన రోజు జరుపుకోనున్నారు.

  • Written By:
  • Updated On - September 15, 2022 / 05:28 PM IST

ఈ ఏడాది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు ప్రత్యేకంగా ఉండబోతోంది. మోదీ సెప్టెంబర్ 17 పుట్టిన రోజు జరుపుకోనున్నారు. ఆ రోజున దాదాపు 7దశాబ్దాల తర్వాత చిరుతల బృందం భారత గడ్డపై అడుగుపెట్టబోతున్నాయి. నమీబియా నుంచి 8 చిరుతలు 70 ఏళ్ల తర్వాత భారత్ కు చేరుకోనున్నాయి. వాటిని తీసుకొచ్చేందుకు భారత్ నుంచి నమీబియా కు ప్రత్యేక విమానం వెళ్లింది. కార్గో విమానంలో నమీబియా నుండి జైపూర్‌కు తీసుకురానున్నట్లు సమాచారం.

అదే రోజు మధ్యప్రదేశ్‌లోని కునో-పాల్పూర్ నేషనల్ పార్క్‌కు తీసుకువస్తారు . ప్రధాని మోడీ తన పుట్టినరోజున దేశానికి అందజేయనున్నారు. ల్యాండ్ ఆఫ్ టైగర్స్‌కు గుడ్‌విల్ అంబాసిడర్‌లను తీసుకెళ్లేందుకు బహదూర్ ల్యాండ్‌కి ప్రత్యేక విమానంలో రాయబారి వచ్చాడని నమీబియాలోని భారత హైకమిషన్ ట్వీట్ చేసింది.