Accident: యూపీలో ఘోరరోడ్డు ప్రమాదం…10మంది యాత్రికులు దుర్మరణం..!!

ఉత్తరప్రదేశ్ లో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పదిమంది యాత్రికులు దర్మరణం చెందారు. మరో 7గురికి తీవ్రగాయాలయ్యాయి.

  • Written By:
  • Updated On - June 23, 2022 / 09:47 AM IST

ఉత్తరప్రదేశ్ లో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పదిమంది యాత్రికులు దర్మరణం చెందారు. మరో 7గురికి తీవ్రగాయాలయ్యాయి. పిలిభిత్ లోని గజ్రౌలా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ తెల్లవారుజామున నాలుగ గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న డీసీఎం రోడ్డుపక్కనున్న చెట్టును ఢీకొట్టింది. హైవే పై బోల్తాపడింది. ఈ ఘటనలో పదిమంది అక్కడిక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

బాధితులంతా హరిద్వార్ నుంచి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గురైనవారిలో ఎక్కువమంది లఖింపూర్ లోని గోలాకు చెందినవారుగా గుర్తించారు. ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తే కారణమని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. రోడ్డుపై పడిన డీసీఎంను తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు పోలీసులు.