Padma Awards: బిపిన్ రావత్ కు ‘పద్మవిభూషణ్’

గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ అవార్డుల జాబితాను మంగళవారం రాత్రి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 128 మందికి పద్మ అవార్డులు లభించాయి.

  • Written By:
  • Updated On - January 26, 2022 / 11:36 AM IST

గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ అవార్డుల జాబితాను మంగళవారం రాత్రి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 128 మందికి పద్మ అవార్డులు లభించాయి. ఇందులో నలుగురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 107 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించింది. హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సీడీఎస్ బిపిన్ రావత్‌కు ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. మహారాష్ట్రకు చెందిన ప్రభా ఆత్రే, రాధేశ్యామ్‌ ఖేమ్కా (మరణానంతరం), కల్యాణ్‌సింగ్‌‌కు (మరణానంతరం) పద్మ విభూషణ్‌ పురస్కారం లభించింది. ఇక కాంగ్రెస్‌ నేత గులాం నబీ ఆజాద్‌కు పద్మ భూషణ్‌ను ప్రకటించింది. కొవాగ్జిన్‌ టీకాను అభివృద్ధి చేసిన భారత్‌ బయోటెక్‌ సీఎండీ కృష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్ర ఎల్లకు పద్మభూషణ్‌ పురస్కారం వరించింది.

కొవిషీల్డ్‌ టీకా తయారు చేసిన సీరమ్‌ సంస్థ వ్యవస్థాపకులు సైరస్‌ పూనావాలాకు కూడా ఈ పురస్కారం లభించింది. వీరితో పాటు టెక్ దిగ్గజాలైన గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లను ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారానికి ఎంపిక చేశారు. ఇక పద్మశ్రీ అవార్డులు ఇండియాకు ఒలంపిక్స్‌లో గోల్డ్ మెడల్ తెచ్చిపెట్టిన నీరజ్ చోప్రా, సీనియర్ షాపుకారు జానకి ని వరించాయి. అంతేకాకుండా ఈసారి తెలుగు రాష్ట్రాల్లో ఆరుగురికి పద్మశ్రీలు దక్కాయి. ఏపీ నుంచి ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావుకు, సుంకర వెంకట ఆదినారాయణ, షేక్‌హసన్‌ పద్మశ్రీ అవార్డులు దక్కాయి. తెలంగాణలో పద్మజారెడ్డి, దర్శనం మొగిలయ్య, రామచంద్రయ్యలను పద్మశ్రీలు వరించడం పై పలు రంగాల ప్రముఖులు అభినందనలు చెప్పారు.