మరణ శిక్షలను రద్దు చేయాలని లా కమిషన్ కోరుతోంది. భారత రాజ్యాంగ్ రాసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కూడా మరణశిక్షలకు వ్యతిరేకం అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. స్వాతంత్ర్యం తరువాత భారతదేశం పలు చట్టాలను కలిగి ఉన్నప్పటికీ బ్రిటీష్ చట్టం ప్రకారం మరణశిక్ష ను విధించడంపై భిన్నాభిప్రాయలు ఉన్నాయి. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973లో మళ్లీ అమలులోకి వచ్చింది. సెక్షన్ 354(3)తో సహా అనేక ముఖ్యమైన మార్పులు చేయబడ్డాయి. అయినప్పటికీ మరణశిక్ష విధించినప్పుడల్లా పలు కారణాలను నమోదు చేయాల్సి ఉంది. భారతదేశంలో మరణశిక్షను కొనసాగించాలని 1967లో 35వ నివేదిక సిఫార్సు చేసినప్పటి నుండి దేశం యొక్క ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అంశాలు తీవ్రంగా మారాయని లా కమిషన్ ఆఫ్ ఇండియా భావించింది. 2016లో, లా కమిషన్ ఆఫ్ ఇండియా తన 262వ నివేదికలో ఉగ్రవాద సంబంధిత నేరాల్లో మినహా మరణశిక్షను రద్దు చేయాల్సిన అవసరం ఉందని తేల్చింది. జీవిత ఖైదు కంటే మరణశిక్ష ఎక్కువ ప్రభావాన్ని చూపుతుందని భావించే ఆధారాలు లేవని లా కమిషన్ పేర్కొంది. ఇదే విషయాన్ని ఐక్యరాజ్య సమితికి లా కమిషన్ తెలియచేసింది. మరణశిక్ష ఖైదీల భయానక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఎన్ఎల్యు ఢిల్లీ ‘డెత్వర్తీ’ నివేదికను విడుదల చేయడంతో మరణశిక్షను రద్దు చేయాలనే డిమాండ్ మరింత పెరిగింది.
Also Read : స్మగ్లర్లలో మార్పులు తీసుకొచ్చిన కరోనా
భారత జైళ్లలోని ఖైదీలు సుమారు 60శాతం మంది మానసిక రోగంతో బాధపడుతున్నారు. ఆ విషయం ఇటీవల చేసిన ఒక అధ్యయనం బయటపెట్టింది. అందుకు సంబంధించిన పలు కారణాలను కూడా ఆ అధ్యయనంలో తేల్చారు. నేరారోపణ, శిక్ష మధ్య చాలా వ్యత్యాసం ఉండడం ఒక ప్రధాన కారణంగా కనిపిస్తోంది. శిక్షపై డిఫెన్స్ లాయర్లు చేస్తోన్న వాదనలు సరిగా లేకపోవడం మరో కారణం. ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆధారాలతోనే 49శాతం కేసుల్లో మరణశిక్ష పడడం ఇంకో కారణంగా అధ్యయనం చెబుతోంది.యావజ్జీవ కారాగార శిక్షను సాధారణ శిక్షగా పరిగణించే వాస్తవాన్ని పూర్తిగా విస్మరించడం కూడా జరుగుతోంది. ట్రయల్ కోర్టులు 73.4% కేసులలో జీవిత ఖైదు ప్రాధాన్యతను పట్టించుకోవడంలేదని అధ్యయనంలో తేలింది. ఢిల్లీలోని నేషనల్ లా యూనివర్శిటీలోని డెత్ పెనాల్టీ సెంటర్ విడుదల చేసిన 2016 నివేదిక ప్రకారం, కొంతమంది ఖైదీలు చాలా ఆశాజనకంగా ఉన్నారు, మరికొందరు “ఉరిశిక్ష విధించబడుతుందనే నమ్మకంతో జీవితాన్ని గడపడం కంటే ఉరితీయడాన్ని ఇష్టపడున్నారు.
Also Read : యూపీ ఎన్నికలపై జేపీ నడ్డా జోస్యం… 300 సీట్లు గెలుస్తామని ధీమా…?
మరణశిక్షలో ఉన్న ఖైదీలు, డిఫెన్స్ లాయర్ల మధ్య ఆర్థిక పరమైన అంశాలు చాలా ఎక్కువగా న్యాయంపై అడ్డంకులను సృష్టిస్తున్నాయి. ముద్దాయిల కుటుంబాలు భరించగలిగే “తక్కువ రుసుము” కారణంగా న్యాయవాదులు ఇబ్బంది పడుతున్నారని తేల్చింది. 2016 నివేదిక ప్రకారం, ట్రయల్ కోర్ట్ మరియు అప్పీలేట్ కోర్టు స్థాయిల్లో మరణ శిక్ష అనుభవిస్తోన్న ఖైదీల కుటుంబాల నుండి డబ్బు వసూలు చేయడానికి ప్రయత్నించారనే ఆరోపణలు ఉన్నాయని అధ్యయనంలో తేలింది. ఇలాంటి పలు కారణాలను పరిగణనలోకి తీసుకుంటే, మరణశిక్షను రద్దు చేయడం బెటరనే వాదన బలపడుతోంది.