Site icon HashtagU Telugu

Physical Harrasment : ఝార్ఖండ్‌లో మరో ఘోరం.. డాన్సర్‌పై సామూహిక అత్యాచారం

Physical Harrasment

Physical Harrasment

జార్ఖండ్‌లోని పాలము జిల్లాలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 21 ఏళ్ల స్టేజ్ ఆర్టిస్ట్‌పై ఆమె సహనటులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దుమ్కా జిల్లాలో విదేశీ పర్యాటకురాలిపై సామూహిక అత్యాచారం జరిగినట్లు ఆరోపించిన కొన్ని రోజుల తర్వాత ఈ సంఘటన జరిగింది. పాలముకు చెందిన ముగ్గురు సహ నటులు స్టేజ్ ఆర్టిస్ట్‌కు మత్తుమందు ఇచ్చి కారులో అత్యాచారం చేశారని పోలీసు అధికారి తెలిపారు.

ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని, బాధితురాలిని పాలములోని ఆసుపత్రిలో చేర్చామని, అక్కడ ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహిస్తామని విశ్రాంపూర్ సబ్ డివిజనల్ పోలీసు అధికారి (ఎస్‌డిపిఓ) రాకేష్ సింగ్ తెలిపారు.రాష్ట్ర రాజధాని రాంచీకి 200 కిలోమీటర్ల దూరంలోని విశ్రాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోడ్డుపై శనివారం అర్థరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.మహిళను అపస్మారక స్థితిలో వదిలి నిందితులు అక్కడి నుంచి పారిపోయారని చెప్పారు.

We’re now on WhatsApp. Click to Join.

ఛత్తీస్‌గఢ్‌ నుంచి పాలము జిల్లాలోని విశ్రాంపూర్‌లో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు మహిళా కళాకారిణి వచ్చిందని ఎస్‌డిపిఓ తెలిపారు.కొన్ని కారణాల వల్ల ఆ కార్యక్రమం నిర్వహించలేకపోయారని. కాబట్టి, ఆమె తన సహనటులతో కలిసి హుస్సేనాబాద్‌లో మరొక ఫంక్షన్‌కు బయలుదేరిందని తెలిపారు. అయితే.. మార్గం మధ్యలో హుస్సేనాబాద్‌కు వెళ్లే మార్గంలో, నిందితులు మహిళకు కొన్ని మత్తుపదార్థాలు తినిపించారని, దీంతో సదరు బాధితరాలు స్పృహ కోల్పోయింది. దీంతో ఆ తర్వాత వారు కారులో ఉన్న బాధితురాలిపై అత్యాచారం చేశారు. ఆ తరువాత ఆమెను అపస్మారక స్థితిలో రోడ్డు పక్కన వదిలి పారిపోయారని రాకేష్ సింగ్ వెల్లడించారు.

ఈ ఘటనపై పోలీసులకు ఆదివారం సమాచారం అందిందని, అనంతరం ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని తెలిపారు. మరోవైపు మూడో నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అంతకుముందు, శుక్రవారం రాత్రి, దుమ్కా జిల్లాలో తన భర్తతో కలిసి డేరాలో ఉంటున్న విదేశీ పర్యాటకురాలిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేయగా, మిగిలిన నలుగురు నిందితుల కోసం గాలిస్తున్నారు.
Read Also : Narendra Modi : తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది

Exit mobile version