AI Alert – Train Drivers Sleep : రైళ్లలో ఏఐ డివైజ్.. డ్రైవర్లు నిద్రలోకి జారుకోకుండా నిఘా

AI Alert - Train Drivers Sleep : రైలు ప్రమాదాలను తగ్గించేందుకు ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ టెక్నాలజీ వినియోగంలోకి వచ్చింది. 

  • Written By:
  • Publish Date - September 10, 2023 / 01:59 PM IST

AI Alert – Train Drivers Sleep : రైలు ప్రమాదాలను తగ్గించేందుకు ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ టెక్నాలజీ వినియోగంలోకి వచ్చింది.  ఈ సాంకేతికతతో కూడిన ఒక డివైజ్ ను ఇప్పుడు రైలు డ్రైవర్ల క్యాబిన్ లలో అమరుస్తున్నారు.  ఒకవేళ రైలు డ్రైవర్లు నిద్ర మత్తులోకి జారుకుంటున్నారని అనిపిస్తే  .. వారు కనురెప్పలు వాలుస్తున్నారని అనిపిస్తే ఈ డివైజ్‌ ఇట్టే గుర్తిస్తుంది. వెంటనే సౌండ్స్ చేసి వారిని అలర్ట్ చేస్తుంది. వారు రెస్పాండ్ కాకుంటే.. అవసరమైతే రైలుకు ఎమర్జెన్సీ బ్రేకులు కూడా వేస్తుంది. ఈ టెక్నాలజీని తొలిసారిగా పైలట్ ప్రాజెక్టు ప్రాతిపదికన నార్త్‌ ఈస్ట్‌ ఫ్రాంటియర్ రైల్వే (NFR) వినియోగంలోకి తెచ్చింది. ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ టెక్నాలజీతో పనిచేసే ఈ పరికరానికి ‘రైల్వే డ్రైవర్‌ అసిస్టెన్సీ సిస్టమ్‌’ (RDAS) అని  పేరు పెట్టారు.

Also read : Biden Visits: భారత్ కు బైబై.. వియత్నాంకు బయలుదేరిన అమెరికా అధ్యక్షుడు బైడెన్..!

పైలట్‌ ప్రాజెక్టులో భాగంగా 20 గూడ్స్‌ రవాణా ఇంజిన్లు (WAG9), ప్యాసెంజర్‌ రైలు ఇంజిన్లలో (WAP7) దీన్ని వినియోగించనున్నారు. ఈ పరీక్షలు పూర్తయిన తర్వాత నివేదిక ఇవ్వాలని ఆయా రైల్వే జోన్లకు నార్త్‌ ఈస్ట్‌ ఫ్రాంటియర్ రైల్వే బోర్డు సూచించింది. ఆ డివైజ్ ను మరింత మెరుగుపర్చేందుకు సూచనలు కూడా ఇవ్వాలని వెల్లడించింది. ది ఇండియన్‌ రైల్వే లోకో రన్నింగ్‌మెన్‌ ఆర్గనైజేషన్‌ (IRLRO) మాత్రం ఈ పరికరాన్ని వ్యతిరేకిస్తోంది. దీన్ని అనవసర ప్రయాసగా అభివర్ణిస్తోంది. వేగంగా ప్రయాణించే రైళ్లలో డ్రైవర్లను అప్రమత్తం చేసే వ్యవస్థలు ఇప్పటికే వాదిస్తోంది.