Rahul Gandhi : ఇకపై ఓట్ల దొంగతనం కుదరదు..వీడియోతో కాంగ్రెస్ కొత్త ప్రచారం

తాజాగా ఈ అంశాన్ని మరింత ప్రజలకు చేరవేయడానికి రాహుల్ గాంధీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో  ఓ ఆసక్తికరమైన వీడియోను షేర్ చేశారు. "లాపాటా ఓటు" అనే పేరుతో రూపొందించిన ఈ వీడియో, బాలీవుడ్ సినిమాల శైలిలో రూపొందించబడింది. వీడియోలో ఓటు చోరీని చిత్రీకరించిన విధానం సామాన్య ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది.

Published By: HashtagU Telugu Desk
No more vote theft..Congress' new campaign with video

No more vote theft..Congress' new campaign with video

Rahul Gandhi : గత కొద్ది రోజులుగా దేశ రాజకీయాల్లో ఓటింగ్ ప్రక్రియపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఓట్ల దొంగతనం జరుగుతోందంటూ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ గత కొన్ని రోజులుగా ఈ అంశంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఆయన ఆరోపణల ప్రకారం, దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఎన్నికల సమయంలో వ్యాప్తిలో ఉన్న ఓటర్ల పేర్లను తొలగించడం, తప్పుడు ఓట్లు వేయించడం లాంటి చర్యలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. తాజాగా ఈ అంశాన్ని మరింత ప్రజలకు చేరవేయడానికి రాహుల్ గాంధీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో  ఓ ఆసక్తికరమైన వీడియోను షేర్ చేశారు. “లాపాటా ఓటు” అనే పేరుతో రూపొందించిన ఈ వీడియో, బాలీవుడ్ సినిమాల శైలిలో రూపొందించబడింది. వీడియోలో ఓటు చోరీని చిత్రీకరించిన విధానం సామాన్య ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది.

Read Also: Shubhanshu Shukla : స్వదేశానికి శుభాంశు శుక్లా .. ప్రధాని మోదీతో భేటీ అయ్యే అవకాశం!

ఇందులో ఓటు ఎంత విలువైనదో, దానిని దొంగిలించడమే ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయడమన్న అంశాన్ని హైలైట్ చేశారు. రాహుల్ గాంధీ ఈ వీడియోను షేర్ చేస్తూ ప్రజలు మేల్కొన్నారు. ఇకపై ఓట్ల దొంగతనం జరగదు అంటూ ఒక ఆత్మవిశ్వాసంతో ట్వీట్ చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీయడంతోపాటు, అధికార పార్టీకి కూడా ఎదురు ప్రశ్నలు రావడానికి దారితీశాయి. వీడియో చివర్‌లో కలిసి కట్టుగా ఓటు దొంగతనానికి వ్యతిరేకంగా మన గొంతును పెంచుదాం. మన హక్కులను కాపాడుకుందాం” అంటూ కాంగ్రెస్ పార్టీ ప్రజలను సమష్టిగా చైతన్యపరిచే సందేశం ఇచ్చింది. ఇది ఒక విధంగా ప్రజాస్వామ్య పరిరక్షణకు ఇచ్చే పిలుపుగా పేర్కొనవచ్చు.

ఈ ప్రచారం ద్వారా కాంగ్రెస్ పార్టీ, రాబోయే ఎన్నికల దృష్ట్యా ఓటర్లలో అవగాహన పెంచాలని, ఓటు హక్కు (పవిత్రమైనది) అని గుర్తుచేయాలని ప్రయత్నిస్తోంది. “లాపాటా ఓటు” అనే క్యాంపెయిన్ సామాజిక మాధ్యమాల్లో వేగంగా పాపులర్ అవుతోంది. ఇప్పటికే అనేకమంది నెటిజన్లు ఈ వీడియోను షేర్ చేస్తూ, తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఈ పరిణామాలు దేశంలో ఎన్నికల విధానంపై మరోసారి ప్రజల్లో చర్చను మొదలుపెట్టాయి. ఓట్ల దొంగతనంపై పారదర్శకంగా విచారణ జరగాలని, ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలంటూ పలువురు నిపుణులు కూడా డిమాండ్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ విధంగా వినూత్న ప్రచార పద్ధతులు అవలంబిస్తూ ప్రజలలో చైతన్యం రేపడానికి ప్రయత్నిస్తున్న తీరు రాజకీయంగా ఆసక్తికరంగా మారుతోంది.

Read Also: Terrorist : ధర్మవరంలో ఉగ్రవాది అరెస్ట్

 

  Last Updated: 16 Aug 2025, 01:06 PM IST