Site icon HashtagU Telugu

NDA Meeting: న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న మ‌రోసారి భేటీ కానున్న ఎన్డీయే మిత్ర‌ప‌క్షాలు..?!

NDA Meeting

NDA Meeting

NDA Meeting: 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించేందుకు భారతీయ జనతా పార్టీ (బిజెపి) నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ) బుధవారం మిత్రపక్షాలతో సమావేశమైంది. ఇప్పుడు తదుపరి సమావేశాన్ని (NDA Meeting) జూన్ 7వ తేదీన ఉదయం 11 గంటలకు జ‌ర‌ప‌నుంది. దీనికి ఎన్‌డిఎ పార్లమెంటరీ పార్టీ నేతలు హాజరుకానున్నారు. జూన్ 7వ తేదీన ప్రధాని మోదీ ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నాయకుడిగా ఎన్నికవుతారు. జూన్ 8న ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఈ నేతలు ఎన్డీయే సమావేశానికి హాజరయ్యారు

ఎన్డీయే సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, జె.పి. నడ్డా, రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్, ఏక్నాథ్ షిండే, హెచ్.డి. కుమారస్వామి, చిరాగ్ పాశ్వాన్, జితన్ రామ్ మాంఝీ, పవన్ కళ్యాణ్‌లు ఉన్నారు. వీరితో పాటు సునీల్ తట్కరే, అనుప్రియా పటేల్, జయంత్ చౌదరి, ప్రఫుల్ పటేల్, ప్రమోద్ బోరో, అతుల్ బోరా, ఇందర్ హంగ్ సుబ్బా, సుదేశ్ మహతో, రాజీవ్ రంజన్ సింగ్, సంజయ్ ఝా పాల్గొన్నారు. బుధవారం ప్రధాని అధికారిక నివాసం ఎల్‌కేఎంలో ఎన్డీయే సమావేశం జరిగింది.

Also Read: Mahesh Babu: చంద్రబాబు, పవన్ గెలుపుపై మహేశ్ అదిరే ట్వీట్

రాష్ట్రపతికి ప్రధాని రాజీనామా సమర్పించారు

బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. మంత్రి మండలితో పాటు ఆయన తన రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించారు. రాష్ట్రపతి అతని రాజీనామాను ఆమోదించారు. కొత్త ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించే వరకు పదవిలో కొనసాగాలని ఆయనను, మంత్రి మండలిని రాష్ట్ర‌ప‌తి అభ్యర్థించారు.

ప్రధాని మోదీకి మద్దతు లభించింది

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వ ప్రజా సంక్షేమ విధానాల వల్ల 2024 నాటి 140 కోట్ల మంది దేశప్రజలు గత 10 ఏళ్లలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని తీర్మానంలో పేర్కొన్నారు. చాలా సుదీర్ఘ విరామం తర్వాత దాదాపు 6 దశాబ్దాల తర్వాత భారతదేశ ప్రజలు వరుసగా మూడోసారి సంపూర్ణ మెజారిటీతో బలమైన నాయకత్వాన్ని ఎన్నుకున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్డీఏ ఐక్యంగా పోరాడి గెలిచింద‌ని మ‌న‌కు తెలిసిందే. అయితే కూట‌మిలోని నాయ‌కులు ఏకగ్రీవంగా ఎన్డీయే అధినేత నరేంద్ర మోదీని నాయకుడిగా ఎన్నుకున్నారు.

We’re now on WhatsApp : Click to Join

ఈ సమావేశంలో ప్రధాని మోదీ నేతలందరికీ అభినందనలు తెలిపారు. అంతేకాకుండా అందరూ బాగా పోరాడారన్నారు. ఎన్డీయే ఇప్పుడు దేశాభివృద్ధికి కృషి చేస్తుంది. ప్రజల కోసం మా పని కొనసాగిస్తామ‌ని మోదీ చెప్పుకొచ్చారు.

ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం చేయకూడదు: నితీష్ కుమార్

బుధవారం ఎన్డీయే సమావేశానికి హాజరైన సీఎం నితీశ్ కుమార్.. ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం చేయొద్దని అన్నారు. వీలైనంత త్వరగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని మోదీకి సూచించారు. ఈసారి ఫలితాల్లో బీజేపీ ఒక్కటే మెజారిటీ (272) మార్కును తాకలేక కేవలం 240 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ప్రతిపక్ష ఇండియా కూట‌మి 234 సీట్లు గెలుచుకుంది.