Site icon HashtagU Telugu

Nagpur Violence: నాగ్‌పూర్‌లో అల్లర్లు.. అమల్లోకి 144 సెక్షన్‌.. కారణం అదే ?

Nagpur Violence Rumours Bajrang Dal Muslim Community

Nagpur Violence: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఉన్న మహల్, హంసాపురి ఏరియాల్లో అల్లర్లు చెలరేగాయి. కొందరు అల్లరి మూకలు పలు దుకాణాలపైకి రాళ్లు రువ్వారు.  కొన్ని వాహనాలకు నిప్పు పెట్టారు. తొలుత ఈ అల్లర్లు మహల్ ఏరియాలో మొదలయ్యాయి. అవే హంసాపురి ఏరియా దాకా విస్తరించాయి. దీంతో నాగ్‌పూర్‌లో పోలీసులు 144 సెక్షన్‌ను విధించారు. అత్యవసరం అయితే ఇళ్ల నుంచి బయటికి రావాలని ప్రజలకు పోలీసులు పిలుపునిచ్చారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వదంతులను నమ్మొద్దని అన్ని వర్గాల ప్రజలను కోరారు. మహల్, హంసాపురి ఏరియాలు మినహా నాగ్‌పూర్‌(Nagpur Violence) నగరంలోని మిగతా ప్రాంతాల్లో ఎలాంటి అల్లర్లు జరగలేదని పోలీసులు వెల్లడించారు. ఆ రెండు ప్రాంతాల్లోనూ భారీగా భద్రతా బలగాలను మోహరించి, పరిస్థితిని అదుపులోకి తెచ్చామన్నారు.

ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం ఉన్న ఏరియాలోనే.. 

అల్లర్లలో పాల్గొన్న 20 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా మిగతా వారిని కూడా పట్టుకుంటామని చెప్పారు.  ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు చెప్పారు. హంసాపురి ప్రాంతంలో అల్లర్లలో పాల్గొన్న వారు ఫేస్ మాస్కులు ధరించి వచ్చారని పోలీసులు గుర్తించారు. వారి చేతిలో తల్వార్లు, కర్రలు, గాజు సీసాలు ఉన్నాయన్నారు. పకడ్బందీ ప్లాన్ ఉన్నందు వల్లే ఫేస్ మాస్కులు ధరించి వచ్చారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మహల్ ఏరియాలో జరిగిన అల్లర్లలో ఓ వర్గానికి చెందిన దాదాపు 1,000 మంది పాల్గొన్నారని తెలిసింది.  నాగ్‌పూర్ ప్రాంత ప్రజలు వదంతులను నమ్మొద్దని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ కోరారు. శాంతిభద్రతల నిర్వహణలో పోలీసులకు సహకరించాలన్నారు. కాగా, రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) ప్రధాన కార్యాలయం కూడా నాగ్‌పూర్‌లోని మహల్‌ ప్రాంతంలోనే ఉంటుంది.

Also Read :Belly Fat: బెల్లీ ఫ్యాట్‌తో ఇబ్బంది ప‌డుతున్నారా.. అయితే ఈ డ్రింక్స్‌తో కొవ్వు త‌గ్గించుకోండి!

అల్లర్లకు కారణం అదేనా ?

Also Read :Liquor Scam: ఏపీలో రూ.4000 కోట్ల మద్యం కుంభకోణం.. సిట్ విచారణలో షాకింగ్ విషయాలు!