NIA : మోస్ట్ వాంటెడ్ ఖలిస్తానీ టెర్రరిస్ట్ అరెస్ట్..ఢిల్లీ ఎయిర్ పోర్టులో పట్టుకున్న ఎన్ఐఏ..!!

  • Written By:
  • Publish Date - November 22, 2022 / 05:49 AM IST

మోస్ట్ వాంటెడ్ ఖలిస్తానీ టెర్రరిస్టును ఎన్ఐఏ అరెస్టు చేసింది. ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించిన ఉగ్రవాదిని సోమవారం ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. ఈ టెర్రరిస్టుపై రూ. 5లక్షల రివార్డు ఉంది. అరెస్టు అయిన ఉగ్రవాది కుల్విందర్ జిత్ ఖాన్ పురియాగా తెలిపింది ఎన్ఐఏ. డేరా సచ్చా సౌదా సంబంధిత సంస్థలతోపాటు పంజాబ్ పోలీసులు, భద్రత, బీబీఏంబీలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడినట్లు వెల్లడించింది. బీకేఐ, కేఎల్ఎఫ్ వంటి టెర్రరిస్టు గ్రూపులతో సంబంధాలు ఉన్నట్లు ఎన్ఐఏ తెలిపింది. అరెస్టు అయిన ఉగ్రవాది పంజాబ్ లో పలువురు హత్యలకు టార్గెట్ చేయడంతోపాటు ఉగ్రవాద కేసుల్లో ప్రమేయం ఉంది.

న్యూఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ లో జరిగిన బాంబు పేలుళ్ల కేసుతోపాటు..ఇతర రాష్ట్రాల్లో జరిగిన గ్రేనేడ్ దాడుల్లో ప్రమేయం ఉంది. పంజాబ్ లోని డేరా సచ్చ సౌదా అనుబంధ సంస్థలతోపాటు పోలీసు, భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని భారత్ లో ఉగ్రదాడులకు కుట్ర పన్నినట్లు దర్యాప్తులో తేలింది. అంతేకాదు దేశంలో భీభత్సం స్రుష్టించాలన్న లక్ష్యంతో చంఢీగడ్ లోని భాక్రా బియాస్ మేనేజ్ మెంట్ బోర్డు సీనియర్ అధికారులను లక్ష్యంగా చేసకున్నట్లు సమాచారం.