Minor Girl Rape : గురుగ్రామ్‌లో దారుణం.. 15 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి ఆపై..?

గురుగ్రామ్‌లో దారుణ ఘ‌ట‌న చోటుచేసుకుంది. 15 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి, ఆమెకు పరిచయం ఉన్న పాల వ్యాపారితో సహా

  • Written By:
  • Updated On - May 21, 2023 / 10:50 AM IST

గురుగ్రామ్‌లో దారుణ ఘ‌ట‌న చోటుచేసుకుంది. 15 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి, ఆమెకు పరిచయం ఉన్న పాల వ్యాపారితో సహా ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన‌ట్లు పోలీసులు తెలిపారు. ఈ నిందితుల నుంచి ఆమె త‌ప్పించుకోవ‌డానికి ప్రయత్నించినప్పుడు ఆమెను కొట్టి చంపేస్తానని బెదిరించారని పోలీసులు తెలిపారు. నిందితుడు పాల వ్యాపారి వినోద్, అతని స్నేహితుడు జస్బీర్‌పై బాలల లైంగిక నేరాల నుంచి రక్షణ చట్టంలోని సెక్షన్ 6, ఐపిసి 506 (నేరపూరిత బెదిరింపు) కింద మైనర్ బాలిక ఫిర్యాదు ఆధారంగా శుక్రవారం భోండ్సి పోలీసులు కేసు నమోదు చేశారు.

8వ తరగతి చదువుతున్న తన కుమార్తె శుక్రవారం ఉదయం పాలు తీసుకువ‌చ్చేందుకు వెళ్లి మారుతీ కుంజ్ సమీపంలో వినోద్‌ను కలిసిందని ఆ మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. మిల్క్‌మ్యాన్ మైనర్‌ను తన మోటార్‌సైకిల్‌పై బోంద్సీ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతానికి జస్బీర్ వేచి ఉన్న చోట బలవంతంగా తీసుకెళ్లాడని బాలిక త‌ల్లి ఆరోపించింది. ఆ తర్వాత ఇద్దరూ త‌న కుమార్తెపై అత్యాచారం చేశారరి.. త‌న కూతురు ప్రతిఘటించడంతో ఆమెను చంపేస్తామని బెదిరించడమే కాకుండా కర్రతో దారుణంగా కొట్టి బైక్‌పై పారిపోయారని ఫిర్యాదులో పేర్కొంది. ఘ‌ట‌న త‌రువాత ఆమెను అక్కడే వదిలేసి పారిపోయారని బాలిక త‌ల్లి తన ఫిర్యాదులో పేర్కొంది. చివరకు తమ కాలనీలోని ఓ వీధి మూలన తన కుమార్తె త‌న కుమార్తెను గుర్తించి.. త‌నకు జ‌రిగిన సంఘ‌ట‌న‌ను తెలిపింద‌న్నారు. త‌న కుమార్తె శరీరంపై చాలా చోట్ల గాయాల గుర్తులు ఉన్నాయని బాలిక త‌ల్లి తెలిపింది. మైనర్ బాలిక‌ను ఆసుపత్రికి తరలించగా, ఆమెపై అత్యాచారం జరిగినట్లు వైద్యులు నిర్ధారించారని పోలీసు అధికారులు తెలిపారు.