Milind Soman:ప్రధానిని కలిసిన ‘యూనిటీ రన్’ వీరుడు మిలింద్ సోమన్

ప్రముఖ నటుడు, నిర్మాత, ఫిట్ నెస్ ప్రేమికుడు మిలింద్ సోమన్ ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకున్నారు.

Published By: HashtagU Telugu Desk
Milind Soman Imresizer

Milind Soman Imresizer

ప్రముఖ నటుడు, నిర్మాత, ఫిట్ నెస్ ప్రేమికుడు మిలింద్ సోమన్ ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకున్నారు. ఇటీవలే భారత స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా ఝాన్సీ నుంచి ఢిల్లీ వరకు ఐక్యతా పరుగును జెండా ఊపి ప్రారంభంచడమే కాకుండా, అందులో పాల్గొన్న మిలింద్ సోమన్.. ప్రధానిని కలుసుకున్నారు.

ఇందుకు సంబంధించి ఫొటోలను ట్విట్టర్లో షేర్ చేశారు. ప్రధానిని కలుసుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని ట్వీట్ చేశారు. ప్రధానితో భేటీ సందర్భంగా క్రీడలు, ఆరోగ్యం, ఫిట్ నెస్ కు సంబంధించి ప్రాచీన సంప్రదాయాల గురించి చర్చ జరిగినట్టు మిలింద్ సోమన్ వెల్లడించారు. యోగా, ఆయుర్వేదాన్ని ప్రోత్సహిస్తున్నందుకు ప్రధానిని అభినందించినట్టు చెప్పారు. ఈ నెల 15న యూనిటీ రన్ మొదలు కాగా, 400 కిలోమీటర్లు పరుగెత్తి 22న సోమన్ ఢిల్లీ చేరుకున్నారు.

 

  Last Updated: 24 Aug 2022, 02:34 PM IST