Maharashtra Assembly elections : రేపు బీజేపీ మేనిఫెస్టో విడుదల

Maharashtra Assembly elections : కాంగ్రెస్, శివసేన (UBT), మరియు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (SCP)తో కూడిన ప్రతిపక్ష MVA సంకీర్ణం, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, భారతీయ జనతా పార్టీని కలిగి ఉన్న మహాయుతి కూటమిని సవాలు చేస్తూ, రాష్ట్రంలో అధికారాన్ని తిరిగి పొందాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Published By: HashtagU Telugu Desk
Maharashtra Assembly elections: BJP Manifesto will be released tomorrow

Maharashtra Assembly elections: BJP Manifesto will be released tomorrow

Union Home Minister Amit Shah : నవంబర్‌ 20 తేదీన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రేపు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రేపు (ఆదివారం) సంకల్ప్‌ పాత్ర (మేనిఫెస్టో)ను విడుదల చేయనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది. ప్రధానంగా ఆ పార్టీ ఐదు హామీలను ప్రకటించింది. మహిళలకు నెలకు మూడువేలు, మహాలక్ష్మీ యోజన పథకం కింద బాలికలకు, స్త్రీలకు ఉచిత బస్సు, రైతులకు 3 లక్షల వరకు రుణమాఫీ, ప్రోత్సహకాల కింద 50 వేల వరకు రుణం, కులగణన, 50 శాతం రిజర్వేషన్‌ ఎత్తివేత, 25 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా, నిరుద్యోగ భృతి నెలకు నాలుగువేలు వంటి హామీలను కాంగ్రెస్‌ ఈ ఎన్నికల సందర్భంగా ప్రకటించింది.

ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ మహారాష్ట్రలో రాజకీయ ప్రచారం ఊపందుకుంది. కాంగ్రెస్, శివసేన (UBT), మరియు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (SCP)తో కూడిన ప్రతిపక్ష MVA సంకీర్ణం, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, భారతీయ జనతా పార్టీని కలిగి ఉన్న మహాయుతి కూటమిని సవాలు చేస్తూ, రాష్ట్రంలో అధికారాన్ని తిరిగి పొందాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరియు అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సిపి నాయకుడు అజిత్ పవార్ తన మేనల్లుడు యుగేంద్ర పవార్‌తో తలపడనున్న బారామతిలో అత్యంత నిశితంగా పరిశీలించబడిన పోటీ ఒకటి. యుగేంద్ర అజిత్ పవార్ తమ్ముడు శ్రీనివాస్ పవార్ కుమారుడు. 2024 లోక్‌సభ ఎన్నికలలో బారామతి కూడా హై ప్రొఫైల్ నియోజకవర్గం, సునేత్ర పవార్ సుప్రియా సూలేపై పోటీ చేశారు. 1.5 లక్షల ఓట్ల ఆధిక్యతతో గెలుపొందిన రెండో వ్యక్తి విజేతగా నిలిచారు.

కాగా, కాంగ్రెస్‌ ఎన్నికల హామీలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే ఎద్దేవా చేశారు. కర్ణాటక, రాజస్థాన్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో కూడా ఎన్నికల సమయంలో హామీలను ప్రకటించి.. ఆ తర్వాత వాటి అమలులో డబ్బులు లేవని చేతులెత్తేసుంది. ప్రింటింగ్‌ మిస్టేక్‌ అని తప్పుకుంటుందని కాంగ్రెస్‌పై షిండే విమర్శలు చేశారు. కాగా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 20న జరగనుండగా, మొత్తం 288 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు నవంబర్ 23న జరగనుంది. 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 105, శివసేన 56, కాంగ్రెస్ 44. 2014లో బీజేపీ 122, శివసేన 63, కాంగ్రెస్ 42 సీట్లు గెలుచుకున్నాయి.

Read Also: Elon Musk : ‘ట్రంప్’ ఎఫెక్ట్.. రూ.25 లక్షల కోట్లకు పెరిగిన ఎలాన్ మస్క్ సంపద

  Last Updated: 09 Nov 2024, 01:43 PM IST