Lok Sabha Elections 2024: మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ (BSP) బుధవారం ఉత్తరప్రదేశ్లో రాబోయే లోక్సభ ఎన్నికల కోసం 12 మంది అభ్యర్థులను ప్రకటించింది, మథుర నియోజకవర్గానికి ప్రత్యామ్నాయాన్ని ప్రకటించింది. రెండో జాబితాలో ఘజియాబాద్, అలీఘర్, ఉన్నావ్ మరియు లక్నో మరికొన్ని నియోజకవర్గాల అభ్యర్థులు ఉన్నారు. మథుర లోక్సభ నియోజకవర్గం నుంచి కమల్ కాంత్ ఉప్మన్యు స్థానంలో సురేష్ సింగ్ను పార్టీ బరిలోకి దింపింది. లక్నో నుంచి సర్వర్ మాలిక్ను బరిలోకి దింపింది. మీర్జాపూర్ నుంచి మనీష్ త్రిపాఠికి టికెట్ లభించింది.
బీఎస్పీ గతంలో 25 మంది అభ్యర్థులను ప్రకటించింది. లోక్సభ ఎన్నికలకు బీఎస్పీ ఇప్పటివరకు మొత్తం 36 మంది అభ్యర్థులను ప్రకటించింది. 36 మంది అభ్యర్థుల్లో 9 మంది ముస్లిం వర్గానికి చెందిన వారు ఉన్నారు.
1. ఘజియాబాద్: నందకిషోర్ పుండిర్
2. అలీఘర్: హితేంద్ర కుమార్ అలియాస్ బంటి ఉపాధ్యాయ
3. మధుర: సురేష్ సింగ్ (మారారు)
4. మెయిన్పురి: డా. గుల్షన్ దేవ్ శక్య
5. ఖీరీ: అన్షయ్ కల్రా రాకీజీ
6. ఉన్నావ్: అశోక్ కుమార్ పాండే
7. మోహన్లాల్గంజ్ (SC): రాజేష్ కుమార్ అలియాస్ మనోజ్ ప్రధాన్
8. లక్నో: సర్వర్ మాలిక్
9. కన్నౌజ్: ఇమ్రాన్ బిన్ జాఫర్
10. కౌశాంబి (SC): శుభ్ నారాయణ్
11. లాల్గంజ్ (SC): డాక్టర్ ఇందు చౌదరి
12. మీర్జాపూర్: మనీష్ త్రిపాఠి
Also Read: Allari Naresh : ‘ఆర్య’ సినిమా అల్లరి నరేష్ చేయాల్సింది.. కానీ అల్లు అర్జున్..