Gujarat university : మోదీ గురించి పాఠం..విద్యార్థులకు గొప్ప అనుభూతి !!

కేవలం ఆధునిక నాయకత్వంపైనే కాకుండా, చరిత్రలో దేశానికి సేవలందించిన మహనీయుల కృషిని కూడా ఈ కోర్సులో భాగంగా బోధించనున్నారు. ఛత్రపతి శివాజీ మహరాజ్ యుద్ధ తంత్రాలు, ఆయన పరిపాలనా దక్షతతో పాటు బరోడా సంస్థానాధీశుడు

Published By: HashtagU Telugu Desk
PM Modi

PM Modi

బరోడాలోని మహారాజా సాయాజీరావ్ విశ్వవిద్యాలయం (MSU) సామాజిక శాస్త్రం (Sociology) చదివే విద్యార్థుల కోసం ‘సోషియాలజీ ఆఫ్ పేట్రియాటిజం’ (దేశభక్తి సామాజిక శాస్త్రం) అనే సరికొత్త కోర్సును ప్రవేశపెట్టింది. దేశభక్తికి సంబంధించిన సామాజిక కోణాలను విద్యార్థులకు వివరించడం ఈ కోర్సు ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగానే ‘మోదీతత్వం’ (Moditva) అనే ప్రత్యేక పాఠాన్ని చేర్చారు. ఒక సాధారణ నేపథ్యం నుండి వచ్చిన వ్యక్తి దేశ ప్రధానిగా ఎదిగిన తీరు, ఆయన నాయకత్వ లక్షణాలు సమాజంపై ఎలాంటి ప్రభావం చూపాయనే అంశాలను ఇందులో లోతుగా చర్చించనున్నారు.

నాయకత్వ లక్షణాలు.. సామాజిక ప్రభావం

ఈ పాఠ్యాంశం కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా, సామాజిక దృక్పథంతో రూపొందించబడింది. ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన వివిధ పథకాలు, ఆయన ప్రసంగాలు సమాజంలోని వివిధ వర్గాల్లో ఎలాంటి మార్పులు తీసుకువచ్చాయో విద్యార్థులకు వివరిస్తారు. క్షేత్రస్థాయిలో నాయకత్వం వహించడం, జాతీయవాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం వంటి అంశాలను కేస్ స్టడీలుగా బోధించనున్నారు. ప్రధాని ప్రస్థానం విద్యార్థులకు ఒక గొప్ప అనుభూతిని ఇవ్వడమే కాకుండా, వారిలో స్పూర్తిని నింపుతుందని యూనివర్సిటీ వర్గాలు భావిస్తున్నాయి.

చారిత్రక వీరుల స్ఫూర్తి.. సంపూర్ణ విద్యాబోధన

కేవలం ఆధునిక నాయకత్వంపైనే కాకుండా, చరిత్రలో దేశానికి సేవలందించిన మహనీయుల కృషిని కూడా ఈ కోర్సులో భాగంగా బోధించనున్నారు. ఛత్రపతి శివాజీ మహరాజ్ యుద్ధ తంత్రాలు, ఆయన పరిపాలనా దక్షతతో పాటు బరోడా సంస్థానాధీశుడు మహారాజా సాయాజీరావ్ గైక్వాడ్ చేసిన సామాజిక సంస్కరణలు, ఆయన రచనలను విద్యార్థులకు పరిచయం చేయనున్నారు. ప్రాచీన మరియు ఆధునిక కాలానికి చెందిన నాయకుల భావజాలాలను మేళవించి, విద్యార్థుల్లో దేశాభిమానాన్ని పెంపొందించేలా ఈ పాఠ్యాంశాలను రూపొందించడం విశేషం.

  Last Updated: 03 May 2026, 01:55 PM IST