Site icon HashtagU Telugu

Nepal Rains: నేపాల్ లో విషాదం: త్రిశూలి నదిలో కొట్టుకుపోయిన రెండు బస్సులు

Nepal Rains

Nepal Rains

Nepal Rains: నేపాల్‌లో శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. సెంట్రల్ నేపాల్‌లోని మదన్-ఆషిర్ హైవేపై కొండచరియలు విరిగిపడ్డాయి, దీని కారణంగా 63 మంది ప్రయాణికులతో వెళ్తున్న రెండు బస్సులు త్రిశూలి నదిలో కొట్టుకుపోయాయి. రెండు బస్సుల్లో డ్రైవర్‌తో కలిపి మొత్తం 63 మంది ప్రయాణికులు ఉన్నారు.

చిత్వాన్ చీఫ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఇంద్రదేవ్ యాదవ్ ఈ సంఘటనను ధృవీకరించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, రెండు బస్సులలో బస్సు డ్రైవర్లతో సహా మొత్తం 63 మంది ప్రయాణిస్తున్నట్లు తెలిపారు. తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో బస్సులు నదిలో కొట్టుకుపోయాయి. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని చెప్పారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా బస్సుల కోసం వెతకలేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. కాగా నేపాల్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

ఈ ఘటనపై నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ విచారం వ్యక్తం చేశారు. నారాయణగర్-ముగ్లిన్ రోడ్ సెక్షన్‌లో కొండచరియలు విరిగిపడటంతో వారి బస్సు కొట్టుకుపోవడం మరియు దేశంలోని వివిధ ప్రాంతాల్లో వరదలు మరియు కొండచరియలు విరిగిపడటం వల్ల ఆస్తులు కోల్పోవడం వల్ల సుమారు వందమందికి పైగా ప్రయాణికులు తప్పిపోయినట్లు నివేదించినందుకు నేను చాలా బాధపడ్డాను. నేను హోం అడ్మినిస్ట్రేషన్‌తో పాటు ప్రయాణీకులను వెతికేందుకు ప్రభుత్వ అన్ని ఏజెన్సీలను ఆదేశిస్తానన్నారు.

జిల్లా మేజిస్ట్రేట్ ఇంద్రదేవ్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఖాట్మండు నుంచి రౌతాహట్‌కు వెళ్తున్న ఏంజెల్, గణపతి డీలక్స్ అనే బస్సులు కొండచరియలు విరిగిపడటంతో కొట్టుకుపోయాయి. ప్రాథమిక నివేదికల ప్రకారం ఖాట్మండు వెళ్తున్న బస్సులో 24 మంది, మరో బస్సులో 41 మంది ఉన్నారు. గణపతి డీలక్స్‌లో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రయాణికులు బస్సు నుంచి దూకి తమ ప్రాణాలను కాపాడుకున్నారని అధికారులు సమాచారం అందించారు. నేపాల్ పోలీసులు, సాయుధ పోలీసు బలగాలు సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నాయని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ భవేష్ రిమల్ తెలిపారు.

Also Read: Lizard in Upma: తెలంగాణ మోడల్ స్కూల్‌లో ఉప్మాలో బల్లిపై కేంద్రం సీరియస్