DK Shivakumar: డీకే శివకుమార్‌పై ఎఫ్‌ఐఆర్

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌పై కర్ణాటక లోకాయుక్త ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసినట్లు లోకాయుక్త అధికారి తెలిపారు. సిద్ధరామయ్య నేతృత్వంలోని కర్నాటక ప్రభుత్వం ఇదే కేసును

DK Shivakumar: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌పై కర్ణాటక లోకాయుక్త ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసినట్లు లోకాయుక్త అధికారి తెలిపారు. సిద్ధరామయ్య నేతృత్వంలోని కర్నాటక ప్రభుత్వం ఇదే కేసును దర్యాప్తు చేసేందుకు సీబీఐకి ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకున్న దాదాపు మూడు నెలల తర్వాత ఈ చర్య వచ్చింది.

2023 డిసెంబర్ 22న, అడ్వకేట్ జనరల్ శశి కిరణ్ శెట్టి అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకున్న కర్ణాటక ప్రభుత్వం అధికారికంగా ఈ కేసును సీబీఐ నుంచి కర్ణాటక లోకాయుక్తకు బదిలీ చేసింది.ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి కర్ణాటక లోకాయుక్త ఫిబ్రవరి 2024 రెండవ వారంలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డిప్యూటీ సీఎంపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసిందని లోకాయుక్త వర్గాలు పేర్కొన్నాయి.

2023 నవంబర్ 23న జరిగిన క్యాబినెట్ సమావేశంలో, సిద్ధరామయ్య ప్రభుత్వం మునుపటి బిజెపి ప్రభుత్వ నిర్ణయం చట్టానికి అనుగుణంగా లేదని పేర్కొంది. ఈ కేసు దర్యాప్తునకు సీబీఐకి ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకునేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సీబీఐకి మంజూరు చేసిన అనుమతిని ఉపసంహరించుకునేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత తదుపరి దర్యాప్తు కోసం కేసును లోకాయుక్తకు అప్పగిస్తామని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

సిద్ధరామయ్య నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం 2023 డిసెంబర్ 22న శివకుమార్‌పై ఉన్న ఆదాయానికి మించిన ఆస్తుల కేసును సీబీఐ నుంచి అధికారికంగా బదిలీ చేసింది. అడ్వకేట్ జనరల్ శశికిరణ్ శెట్టి నుంచి న్యాయపరమైన అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి మంజూరు చేసిన అనుమతిని ఉపసంహరించుకోవడమే కాకుండా రాష్ట్ర దర్యాప్తు సంస్థకు అప్పగించింది.

డీజీపీ ఆదేశాల మేరకు డిప్యూటీ సీఎం డీకేపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసుకు సంబంధించి ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు.లోకాయుక్త ఎస్పీ వంశీకృష్ణ మాట్లాడుతూ డిజిపి ఆదేశాల మేరకు మేము బెంగళూరు సిటీ పోలీసుల ముందు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసాము. విచారణ జరుగుతోందన్నారు. ఫిబ్రవరి 2024లో లోక్‌యుక్త పోలీసులు ఈ కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్ మరియు సంబంధిత పత్రాలను స్థానిక కోర్టుకు సమర్పించారు.

Also Read: HYD : కేసీఆర్ కు సీఎం పదవి లేకపోయేసరికి వైసీపీ నేతలకు ధైర్యం వచ్చింది – బిఆర్ఎస్