Kangana Ranaut : కంగనా చేసిన టాప్ కాంట్రవర్సీలు ఇవే

బాలీవుడ్ నటి కంగనా తన నటన కంటే కాంట్రవర్సీ స్టేట్మెంట్ తోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. దేశానికి స్వాతంత్ర్యం విషయంలో కంగనా చేసిన కామెంట్స్ తో తాను మళ్ళీ వార్తల్లో నిలిచారు. ఈ మధ్యకాలంలో కంగనా చేసిన క్రేజీ కాంట్రవర్సీలు ఇవే

  • Written By:
  • Publish Date - November 13, 2021 / 11:16 AM IST

బాలీవుడ్ నటి కంగనా తన నటన కంటే కాంట్రవర్సీ స్టేట్మెంట్ తోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. దేశానికి స్వాతంత్ర్యం విషయంలో కంగనా చేసిన కామెంట్స్ తో తాను మళ్ళీ వార్తల్లో నిలిచారు. ఈ మధ్యకాలంలో కంగనా చేసిన క్రేజీ కాంట్రవర్సీలు ఇవే

1. ఇండియాకి 1947లో వచ్చింది కేవలం బిక్ష మాత్రమేనని, నిజమైన స్వాతంత్య్రం 2014లో వచ్చిందని కంగనా టైమ్స్ నౌ సమ్మిట్ లో పేర్కొంది. దేశ స్వాతంత్ర్త్యాన్ని, త్యాగాలను కంగనా అవమాన పర్చిందని ఆమెపై విమర్శలు చేస్తున్నారు.

2. బాలీవుడ్ నటులందరూ డ్రగ్స్ తీసుకుంటారని, అగ్ర నటులకు డ్రగ్స్ టెస్ట్ చేస్తే అన్ని విషయాలు బయటకొస్తాయని అప్పట్లో హాట్ కామెంట్స్ చేసింది కంగనా.

3. క్రిష్ సినిమా సమయంలో హృతిక్ రోషన్, తాను రిలేషన్ లో ఉన్నామని ఒక ఇంటర్వ్యూలో తెలిపి సెన్సేషన్ క్రియేట్ చేసింది.

4. బాలీవుడ్ నటుడు సుశాంత్ సూసైడ్ పై స్పందించిన కంగనా సుశాంత్ ని కొందరు హత్య చేశారని, aa మరణం వెనకున్న డర్టీ సీక్రెట్స్ తనకి తెలుసని సుశాంత్ మరణంపై అనుమానాలు రేకెత్తేలా చేసింది.

5. మోదీ ప్రభుత్వం తెచ్చిన రైతు చట్టాలని నిరసిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో పోరాటం చేసిన రైతులను ఉద్దేశిస్తూ అక్కడ నిరసన చేసేవాళ్ళు టెర్రరిస్టులని పేర్కొని విమర్శలపాలైంది.

6. మహారాష్ట్రలోని శివసేన ప్రభుత్వంపై పలు రాజకీయ విమర్శలు చేసిన కంగనా ముంబాయిని పాక్ ఆక్రమిత కశ్మీర్ గా పోల్చి సెన్సేషన్ క్రియేట్ చేసింది.

7. ఉదయ బాస్కర్, తాప్సి పొన్ను బీ గ్రేడ్ నటులని, దియా మీర్జా సోనమ్ కపూర్ మాఫియా బింబోస్ అని పేర్కొన్నారు.

8. బాలీవుడ్ లో నేపోటిజం ఉందని, కరణ్ జోహార్ దానికి ఆద్యుడని ఆయనపై ఆరోపణలు చేసింది.